స్వామి వారి దివ్యాశిస్సులతో 3వ తేదీ ఫిబ్రవరి 2019 నాడు రాజన్న సిరిసిల్ల జిల్లా లోని అన్ని శ్రీ సత్యసాయి బాలవికాస్ సెంటర్లందు సాయి గాయత్రి పఠిస్తూ స్వామి వారికి తందులార్చన నిర్వహించడం జరిగింది.ఈ కార్యక్రమంలో జిల్లా వ్యాప్తంగా దాదాపు 120 మంది బాల బాలికలు 12 మంది గురువులు తంగళ్లపల్లి, బొప్పాపూర్ మరియు సిరిసిల్ల లోని బాలావికాస్ సెంటర్ లలో పాల్గొన్నారు.