District / State Meetings






ఓం శ్రీ సాయిరాం భగవాన్ శ్రీ సత్యసాయి బాబా వారి దివ్య అనుగ్రహ ఆశీస్సులతో..... 10/3/2024 ఆదివారం నాడు శ్రీ సత్యసాయి ప్రశాంతి సేవా నిలయం సత్తుపల్లి లో సమీక్షా సమావేశము నిర్వహించబడింది.. జిల్లా అద్యక్షులు, జిల్లా కార్యవర్గ సభ్యులు, సత్తుపల్లి సమితి సీనియర్ సభ్యులు శ్రీ గాదె సత్యనారాయణ గారు,సమితి కన్వీనర్, సత్తుపల్లి సమితి కార్యవర్గ సభ్యులు, పలువురు పెద్దలు, ప్రముఖులు, సీనియర్ సభ్యులు యూత్ సభ్యులు, మహిళా సభ్యులు అధిక సంఖ్యలో ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.. పలువురు సభ్యులు తమ తమ అనుభవాలు తెలిపారు.. శ్రీ సత్యసాయి ప్రశాంతి సేవా నిలయం ప్రారంభోత్సవ కార్యక్రమం విజయవంతం చేసిన స్వామికి కృతజ్ఞతలు తెలిపారు.. జిల్లా అద్యక్షులు మాట్లాడుతూ మన బాధ్యత మరింత పెరిగిందన్నారు. కార్యక్రమాలు సమీక్షించారు.. 5/3/2024 తేదీన శ్రీ RJ రత్నాకర్ గారు మేనేజింగ్ ట్రస్టీ, శ్రీ సత్యసాయి సెంట్రల్ ట్రస్టు వారిచే ప్రారంభించ బడిన శ్రీ సత్యసాయి ప్రేమరధం ఇంఛార్జి గా యూత్ విజయ్ ను ప్రకటించారు.. చక్కటి ప్రణాళికతో గ్రామ గ్రామాన స్వామి దర్శనం కలిగించాలని కొరారు.. తరువాత గౌరవ సీనియర్ సభ్యులు శ్రీ గాదె సత్యనారాయణ గారిని పలువురు సీనియర్ సభ్యులను ప్రేమపూర్వకంగా అభినందించారు సత్కరించారు.. స్వామి వారికి హారతి సమర్పణతో కార్యక్రమం ముగిసింది.. సాయిరాం🙏