*గ్రామ సేవయే రామ సేవ:* గ్రామాల్లో సేవ చేయడం ద్వారా భగవంతుని ఆశీస్సులు నిండుగా ఉంటాయని *భగవాన్ శ్రీ సత్యసాయిబాబా వారి పూర్వ విద్యార్థి శ్రీ రాఘవానంద్* గారు అన్నారు. భగవాన్ శ్రీ సత్య సాయి బాబా వారి దివ్య ఆశీస్సులతో *శ్రీ సత్యసాయి సేవా సమితి కెరెల్లి యువజన విభాగం* ఆధ్వర్యంలో వికారాబాద్ జిల్లా స్థాయిలో గ్రామ సేవా కార్యక్రమం *దారుర్ మండలంలోని కె రెల్లి దత్తత గ్రామం హరిదాస్పల్లి* గ్రామంలో ఈ రోజు నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా విచ్చేసి మాట్లాడారు. గ్రామాల్లో సేవ చేయడం వలన భగవాన్ శ్రీ సత్య సాయి బాబా వారి ఆశీస్సులు నిండుగా ఉంటాయని అన్నారు. భగవాన్ శ్రీ సత్యసాయిబాబా వారి 98వ జన్మదినోత్సవ సందర్భంగా గ్రామంలోని 98 గృహాలలో ఏకకాలంలో భజన కార్యక్రమం నిర్వహించడం జరిగింది.అంతకు ముందు గ్రామంలోని పుర వీధుల్లో *పల్లకిసేవ* నిర్వహించడం జరిగింది.ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షులు శ్రీ జగదీశ్వర్ సింగ్ ఠాగూర్ గారు,జిల్లా సేవాదళ్ కోఆర్డినేటర్ శ్రీ ప్రభాకర్ గారు, జిల్లా యువజన సమన్వయకర్త శ్రీ బసవరాజు గారు, సమన్వయకర్త శ్రీ సునీల్ గారు, విశిష్ట అతిథి శ్రీ రఘునాథ్ గారు, కెరెల్లి ,తాండూర్ ,వికారాబాద్, మాదారం సమితుల కన్వీనర్లు శ్రీ K. రామకృష్ణారెడ్డి, శ్రీ వీరేశం, శ్రీ సత్యనారాయణ గౌడ్, శ్రీ నాగరాజు గారు , శ్రీ సత్యసాయి గ్రామీణ సార్వజనిక కేంద్రం, కెరెల్లి,అధ్యక్షులు శ్రీ బి. రఘునందన్ గారు, ప్రధాన కార్యదర్శి ఎం ప్రేమ్ కుమార్ గారు, కోశాధికారి శ్రీ K. వెంకటరామిరెడ్డి గారు, హరిదాసు పల్లి గ్రామ సర్పంచ్ అనిత బిచ్చయ్య గారు ఉపసర్పంచ్ యాదయ్య గారు గ్రామస్తులు రాఘవేందర్ అంజయ్య ,రాజేందర్రెడ్డి, వెంకటయ్య, రాజు , జిల్లాలోని వివిధ భజన మండలి కన్వీనర్లు,సేవాదళ్ సభ్యులు యువకులు, బాలవికాస్ విద్యార్థులు గ్రామస్తులు పాల్గొనడం జరిగింది.