సాయిరాం భగవాన్ శ్రీ సత్య సాయి బాబా వారి దివ్య అనుగ్రహ ఆశీస్సులతో. శ్రీ సత్యసాయి సేవా సంస్థలు, వికారాబాద్ జిల్లా మరియు సావిత్రమ్మ మెమోరియల్ ట్రస్ట్, హైదరాబాద్ వారి సంయుక్త ఆధ్వర్యంలో సాధురం కంటి వైద్యశాల,హైదరాబాద్ వారిచే ఈరోజు అనగా 10 :9 :2023 ఆదివారం కేరెల్లిలోని శ్రీ సత్యసాయి గ్రామీణ సార్వజనిక కేంద్రంలో ఉచిత కంటి వైద్య శిబిరం నిర్వహించడం జరిగింది మొత్తం 200 లకు పైగా పేషెంట్స్ కి కంటి పరీక్షలు నిర్వహించడం జరిగింది దీనిలో 110 మెంబర్స్ కి కంటి అద్దాలు పంపిణీ చేయడం జరిగింది. 25 మందికి కాంట్రాక్ట్ ఆపరేషన్ చేయాలని నిర్ణయించగా 19 మందిని కాంట్రాక్ట్ ఆపరేషన్ చేయడానికి సాధురం కంటి ఆస్పత్రి హైదరాబాద్ కి తీసుకు వెళ్లడం జరిగింది. ఈ శిబిరంలో సావిత్రమ్మ మెమోరియల్ ట్రస్ట్ సమన్వయకర్త చిరంజీవి రెడ్డి, శ్రీ సత్యసాయి గ్రామీణ సార్వజనిక కేంద్రం, కేరెల్లి అధ్యక్షులు శ్రీ B.రఘునందన్ గారు, ప్రధాన కార్యదర్శి శ్రీ M.ప్రేమ్ కుమార్ , శ్రీ సత్యసాయి సేవా సమితి, కేరెల్లి కన్వీనర్ శ్రీ K.రామకృష్ణారెడ్డి, సాధురం కంటి వైద్యశాల సిబ్బంది డాక్టర్ మాధవరెడ్డి గారు, డాక్టర్ అజిత్ గారు , సాధురం కంటి వైద్యశాల క్యాంపు సమన్వయకర్త శ్రీ యాదగిరి గారు, శ్రీ రామకృష్ణ గారు, శ్రీ సత్య సాయి సేవా సమితి కేరెల్లి, సమన్వయకర్తలు మరియు సేవాదళ్ సభ్యులు, బాలవికాస్ విద్యార్థులు, ఉత్సాహంగా సేవలో పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేయడం జరిగింది. ఈరోజు ఈ కార్యక్రమంలో ప్రత్యక్షంగా మరియు పరోక్షంగా పూర్తి సహాయ సహకారాలు అందించిన ప్రతి ఒక్కరికి స్వామి అనుగ్రహ ఆశీస్సులు దండిగా ఉండాలని కోరుకుంటూ. సాయిరాం🙏 లోకా సమస్తా సుఖినోభవంతు - శ్రీ K.రామకృష్ణారెడ్డి కన్వీనర్, శ్రీ సత్యసాయి సేవా సమితి, కేరెల్లి.