Sairam sir. Veterinary camps conducted today at Rudraram and Narasapur villages Dharur mandal under Sri Satyasai Seva samithi Kerelli of Vikarabad dt;26 th August 2023 . Statistics as follows: At Rudraram village: gynaec cases: 29; General cases: 178; Dewormings: 39; Deticking: 194; Total cases treated: 440; Mineral Mixture supplied: 12kg;Feed Supplement supplied: 8Lt; Farmers benefited: 28; ..At Narasapur village: gynaec cases: 48; Dewormings: 581; cattle vaccinations :111; Deticking: 105; General cases: 392; Total cases treated :1237; Mineral Mixture supplied: 20kg; Feed supplement supplied: 9Lt; Farmers benefited: 57; Sevadal participated:05; doctors: 04; parastaff:10; Sevadal: 05; Swamy grace and ur inspiration and support. Pranams. Dr.punnaiah పశువైద్య శిబిరాలను సద్వినియోగం చేసుకోవాలి: ---------------------------- - పశుసంవర్ధక శాఖ రిటైర్డ్ అధికారి డాక్టర్ పున్నయ్య శ్రీ సత్యసాయి సేవా సంస్థలు మరియు పశుసంవర్ధక శాఖ సంయుక్త ఆధ్వర్యంలో నిర్వహించే శిబిరాలను సద్వినియోగం చేసుకోవాలని పశుసంవర్ధక శాఖ విశ్రాంత అధికారి డాక్టర్ పున్నయ్య తెలిపారు. శనివారం శ్రీ సత్య సాయి సేవా సమితి, కేరెల్లి ఆధ్వర్యంలో ధారూర్ మండల పరిధిలోని రుద్రారం,నర్సాపూర్ గ్రామాలలో పశు వైద్య శిబిరాలు నిర్వహించి పశువులకు ఉచితంగా చికిత్సలు అందించారు.ఈ సందర్భగా డాక్టర్ పున్నయ్య ముట్లాడుతూ పశుసంవర్ధక శాఖ నుండి ప్రభుత్వం అందించే పశువుల పునరుత్పత్తి కార్యక్రమాలను సకాలంలో ఉపయోగించుకొని పాలదిగుబడి పెంచుకోవాలని సూచించారు. ప్రస్తుతం గ్రామాలలో ఎక్కువగా పశువులు పేళు, గోమార్లతో ఉండటంవలన రక్తం పీల్చుకొని పశువులను అనారోగ్యానికి గురి చేస్తున్నాయని అన్నారు. దీనికోసం ప్రభుత్వం అందిస్తున్న గాలికుంటు టికాలు ప్రతి ఆరు నెలలకు ఒకసారి వేయించాలని సూచించారు. అదేవిధంగా ప్రభుత్వం అందిస్తున్న నట్టల నివారణ మందులను సద్వినియోగం చేసుకోవాలని తెలిపారు. శనివారం జరిగిన పశు వైద్య శిఖరంలో రుద్రారంలో గర్భకోశ చికిత్సలు - 29, సాధారాణ చికిత్సలు - 178, పేళ మందు - 194,గాలి కుంటు టీకాలు - 39,, మొత్తం -440 పశువులకు చికిత్స చేయగా లవణ మిశ్రమము 12కిలోలు, బలవర్ధక ఆహార పంపిణీ ఐదు లీటర్లు 28 మంది రైతులకు పంపిణీ చేయడం జరిగింది. అన్నారు. నర్సాపూర్ గ్రామంలో గర్భకోన చికిత్సలు - 48, సాధారచికిత్సలు - 392, పేళ మందు - 105, గాలికుంటు టికాలు -- 581, నట్టల మందు -111, మొత్తం - 1237 పశువులకు చికిత్స అందించగా లవణ మిశ్రమం 20 కిలోలు, బలవర్ధక ఆహార పదార్థం 9 లీటర్లు 57 మంది రైతులకు అందించారు. ఈ కార్యక్రమంలో సత్యసాయి వశుసంవర్దక శాఖ నాగసమదర్ డాక్టర్ స్వర్ణలత,తాండూర్ డాక్టర్ భార్గవ, పశు సంవర్ధక శాఖ పారామెడికల్ సిబ్బంది, శ్రీ సత్యసాయి సేవా సంస్థలు సేవాదల్ సభ్యులు శ్రీ డాక్టర్ పద్మాకర్ రావు, కేరెల్లి సమితి సభ్యులు M. నవరతన్ రెడ్డి, పి.అనంతయ్య, శ్రీ M.శశిధర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.