అధిక పాల దిగుబడికి బలవర్దక పోషక పదార్థాల పంపిణీని ఉపయోగించుకోవాలి ------------------------- - పశుసంవర్ధక శాఖ రిటైర్డ్ అధికారి డాక్టర్ పున్నయ్య గ్రామాలలో పశువుల నుండి అధిక పాల దిగుబడి కోసం శ్రీ సత్యసాయి సేవా సంస్థలు అందిస్తున్న బలవర్తక పోషక పదార్థాలను రైతులు సద్వినియోగం చేసుకొని పాల దిగుబడిని పెంపొందించుకోవాలని పశుసంవర్ధక శాఖ రిటైర్డ్ అధికారి డాక్టర్ పున్నయ్య తెలిపారు. గురువారం శ్రీ సత్య సాయి సేవా సమితి, కేరెల్లి సత్యసాయి గ్రామీణ సార్వజనిక కేంద్రం,కేరెల్లి ఆధ్వర్యంలో ధారూర్ మండల పరిధిలోని కేరెల్లి, ఎబ్బనూరు గ్రామాలలో పశు వైద్య శిబిరాలు నిర్వహించి పశువులకు ఉచితంగా చికిత్సలు అందించారు. ఈ సందర్భగా డాక్టర్ పున్నయ్య ముట్లాడుతూ పశుసంవర్ధక శాఖ నుండి ప్రభుత్వం అందించే పశువుల పునరుత్పత్తి కార్యక్రమాలను సకాలంలో ఉపయోగించుకొని పాలదిగుబడి పెంచుకోవాలని సూచించారు. ప్రస్తుతం గ్రామాలలో ఎక్కువగా పశువులు పేళు, గోమార్లతో ఉండటంవలన రక్తం పీల్చుకొని పశువులను అనారోగ్యానికి గురి చేస్తున్నాయని అన్నారు. దీనికోసం ప్రభుత్వం అందిస్తున్న గాలికుంటు టికాలు ప్రతి ఆరు నెలలకు ఒకసారి వేయించాలని సూచించారు. అదేవిధంగా ప్రభుత్వం అందిస్తున్న నట్టల నివారణ మందులను సద్వినియోగం చేసుకోవాలని తెలిపారు. గురువారం జరిగిన పశు వైద్య శిఖరంలో కేరెల్లిలో గర్భకోశ చికిత్సలు - 38, సాధారాణ చికిత్సలు - 150, పేళ మందు - 30,గాలి కుంటు టీకాలు - 95,నట్టల మందు - 75 ఇతర సేవలలో- 75, మొత్తం -370 పశువులకు చికిత్స చేయగా లవణ మిశ్రమము 15కిలోలు, బలవర్ధక ఆహార పంపిణీ ఐదు లీటర్లు 30 మంది రైతులకు పంపిణీ చేయడం జరిగింది అన్నారు. అదేవిధంగా ఎబ్బనూరు గ్రామంలో గర్భకోన చికిత్సలు - 10, సాధారచికిత్సలు - 570, పేళ మందు - 150, గాలికుంటు టికాలు -- 50, నట్టల మందు - 50, మొత్తం - 830 పశువులకు చికిత్స అందించగా లవణ మిశ్రమం 10 కిలోలు, బలవర్ధక ఆహార పదార్థం 5 లీటర్లు 30 మంది రైతులకు అందించారు. ఈ కార్యక్రమంలో వశుసంవర్దక శాఖ ధారూర్ డాక్టర్ హరిప్రియ, నాగసమదర్ డాక్టర్ స్వర్ణలత, సిరిపురం డాక్టర్ నరేంద్రనాథ్ రెడ్డి, సిబ్బంది, కేరెల్లి సేవా సమితి సభ్యులు ఎ.జగదీశ్వర్ రెడ్డి, పి.అనంతయ్య, ఎం.వెంకట్ రెడ్డి, సిఎల్ నరేష్, టి. రాజేందర్ రెడ్డి, టి.శివప్రసాద్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఇట్లు శ్రీ జగదీశ్వర్ సింగ్ ఠాగూర్, జిల్లా అధ్యక్షులు, శ్రీ సత్యసాయి సేవా సంస్థలు, వికారాబాద్ జిల్లా.