ఓం శ్రీ సాయిరాం తేది.08.08.2023 మంగళవారం నాడు ఉదయం 10.00 గంటలనుండి రాత్రి 09.00 గంటల వరకు జరిగిన ములుగు జిల్లాలో బాధలు పడుతున్న వరద బాధితులకు శ్రీ సత్యసాయి సేవా సంస్థలు భూపాలపల్లి జయశంకర్ జిల్లా ఆధ్వర్యంలో నిర్వహించిన సేవా కార్యక్రమాలను విజయవంతం చేయాలనే సంకల్పంతో సాయి యూత్ టేకుమట్ల భజన మండలి నుండి 7గురు భూపాలపల్లి సమితి నుండి 7గురు యూత్ పాల్గొని కొండయి, మల్యాల, ఊరట్టం గూడెం వరద బాధితులకు స్వామి వారి కానుకలుగా మొదట ఏటూరు నాగారం గిరిజన హాలు లో వున్న 300 మంది పైచిలుకు బాధిత కుటుంబాలకు బకెట్లు-130, మగ్గులు-130, చీరలు-300, లుంగీలు-300, టవళ్ళు-300, రగ్గులు-300 అలాగే పిల్లలకు డ్రెస్సులు, షర్టులు, నైటీలు, ప్యాంట్లు అందజేయడం జరిగింది.అలాగే పిల్లలకు బిస్కట్లు, చాకిలెట్లు పంపిణీ చేయడం జరిగింది. అక్కడ భోజనం చేసి వెంటనే మేడారం దగ్గరలో వున్న ఊరట్టం గూడెం లోని 20 ఆదివాసీ కుటుంబాలకు రగ్గులు, చీరలు, లుంగీలు, టవళ్ళు నైటీలు అందజేయడం జరిగింది. తరువాత ఊరట్టం గ్రామ వరద బాధితులకు 80మంది కుటుంబాలకు రగ్గులు, చీరలు, లుంగీలు, టవళ్ళు నైటీలు అందజేయడం జరిగింది. మేడారం దారి మధ్య వెళ్తూ రోడ్డు పక్కన వరదలకు షాప్ లు కోల్పోయి వున్న ఐదుగురు కుటుంబాలకు రగ్గులు పంపిణీ చేయడం జరిగింది. చివరిగా రాత్రి 07.30 గంటలకు శ్రీ సత్యసాయి ముసలమ్మ గూడెం ఆదివాసీలకు 25 టర్పలిన్ షీట్లు, 35 మంది కుటుంబాలకు రగ్గులు, చీరలు, లుంగీలు, టవల్లు పిల్లలకు డ్రెస్సులు, షర్టులు, ప్యాంట్లు స్వామి వారి కృపతో పంపిణీ చేసి దిగ్విజయంగా రాత్రి 09.30 వరకు భూపాలపల్లి చేరడం, అల్పాహారం తీసుకోని ఏడుగురం సాయి యూత్ టేకుమట్లకు తిరుగు ప్రయాణం అయ్యారు. ఈ మెగా కార్యక్రమంలో హైదరాబాద్ నుండి పెద్దలు లక్ష్మినారాయణ గారు, వెంకన్న గారు, భూపాలపల్లి జిల్లా కోఆర్డినేటర్లు ఉమా మహేశ్వర రావు, జైపాల్ రెడ్డి, తిరుపతి రెడ్డి, పెద్దలు పాపన్న, నారాయణ రెడ్డి, సందీప్ సింగ్, యుగంధర్ రెడ్డి ఈ మెగా కార్యక్రమంలో ఒకే రోజు 5 స్థలాలలో వరద బాధితులకు స్వామి వారి కానుకలు అందజేయడం, జిల్లా సాయి యూత్ అధిక సంఖ్యలో (18) మంది పాల్గొనే భాగ్యాన్ని ప్రసాదించిన మన స్వామికి శతకోటి వందనాలు సమర్పించు కుంటూ..... Ch శ్యామ్ సుందర్ రెడ్డి, జిల్లా అధ్యక్షులు, శ్రీ సత్యసాయి సేవా సంస్థలు భూపాలపల్లి జయశంకర్ జిల్లా