ఓం శ్రీ సాయిరాం స్వామి వారి కృపతో తేది.02.07.203 ఆదివారం రోజు ఉదయం 10.00 గంటలనుండి మధ్యాహ్నం 2.00 గంటలవరకు శ్రీ సత్యసాయి సేవా సంస్థలు, భూపాలపల్లి జిల్లా సమీక్షా సమావేశం నిర్వహించుకోవడం జరిగింది. ఈ సమవేశానికి స్టేట్ జిల్లా ఇంఛార్జి శ్రీ భాస్కర్ గారి ఆధ్వర్యంలో జిల్లా అధ్యక్షులు, జిల్లా కోఆర్డినేటర్ లు, సమితి & భజన మండలి కన్వీనర్ లు, కోఆర్డినేటర్ లు మరియు సాయి యూత్ మొత్తం 29 మంది పాల్గొని విజయవంతం చేశారు. బాబా వారి 98వ పుట్టిన రోజు వేడుకల వరకు చేపట్టవలసిన సేవల గురించి సమీక్షించడం జరిగింది, అలాగే బాబా వారి శత జయంతి వేడుకల వరకు చేయవలసిన సేవల గురించి వచ్చే జిల్లా సమావేశంలోగా ప్లాన్స్ సిద్ధం చేసుకోవాలని తరువాత, సమితి కన్వీనర్ లు నెలవారీ రిపోర్టులను తెలియ జేశారు. జిల్లా అధ్యక్షులు, కోరికలపై అదుపు గురించి వివరంగా తెలియజేసి అందరూ ఆచరించి చూపాలని కోరారు. మన స్వామి వారి కృపతో శ్రీ సత్యసాయి ఆధ్యాత్మిక గ్రంథాలయం ను శ్రీ సత్యసాయి సేవా మందిరం, భూపాలపల్లి లో ప్రారంభోత్సవ కార్యక్రమాన్ని జిల్లా స్టేట్ ఇంఛార్జి శ్రీ భాస్కర్ గారు & జిల్లా అధ్యక్షులు శ్రీ Ch శ్యామ్ సుందర్ రెడ్డి గారు నిర్వహించారు. మన బాల్ వికాస్ పూర్వ విద్యార్థుల సహకారాన్ని ఎంతగానో గుర్తుకు చేసుకుంటూ, తెలంగాణలోనే ప్రప్రథమంగా, భూపాలపల్లి జిల్లాలో ఈ గ్రంథాలయాన్ని నిర్వహించుకోవడంతో అందరూ సంతోషం వెలిబుచ్చారు. స్వామి వారి సాహిత్యాన్ని తెలుసుకొనుటకు, ఒక శాశ్వత అవకాశంగా అందరూ కొనియాడారు. ఈ కార్యక్రమంలో జిల్లా కోఆర్డినేటర్ లు, సమితి కన్వీనర్ లు, కోఆర్డినేటర్ లు పాల్గొని విజయవంతం చేశారు. సాయి సేవ బినా కోయి అప్నా నహి మీ Ch మల్లా రెడ్డి జిల్లా అధ్యక్షులు శ్రీ సత్యసాయి సేవా సంస్థలు భూపాలపల్లి జయశంకర్ జిల్లా