🔹 చలివేంద్రం ప్రారంభోత్సవం 🔹 🔺 భగవాన్ శ్రీ సత్యసాయి సేవా సమితి, జగిత్యాల 🔺 సాయినాథుని దివ్య అనుగ్రహ ఆశీస్సులతో భగవాన్ శ్రీ సత్యసాయి సేవా సమితి, జగిత్యాల ఆధ్వర్యంలో 🔹 తేదీ 27-03-2023, సోమవారం నాడు ఉదయం 9.00 గంటలకు స్థానిక కొత్త బస్టాండ్ యందు "చలివేంద్రం(ఉచిత మినరల్ వాటర్ పంపిణీ)" ప్రారంభించుకోవడం జరిగింది స్వామి దయతో మరియు భక్తులందరి సహకారంతో ప్రయాణికుల దాహార్తి ని తీర్చడానికి ఈ రోజు నుండి 2 నెలల పాటు ప్రతిరోజు ఉచితంగా మినరల్ వాటర్ అందించడం జరుగుతుంది. ఇట్టి సేవలో RTC డిపో మేనేజర్, సత్యసాయి సంస్థ తరపున కన్వీనర్ తో పాటు పురుష మరియు మహిళా సేవాదళ్ సభ్యులు పాల్గొనడం జరిగింది. ఆ సాయి నాథుని దివ్య అనుగ్రహ ఆశీస్సులు అందరిపై నిండుగా ఉండాలని మనసారా ప్రార్థిస్తున్నాం. జై సాయిరాం ప్రేమతో కన్వీనర్ & కార్యవర్గం భగవాన్ శ్రీ సత్యసాయి సేవా సమితి, జగిత్యాల