🙏 ఓం శ్రీ సాయిరాం🙏 గోదావరిఖని 8 వ కాలనీ లో 58 వ రుద్రాభిషేకం భగవాన్ శ్రీ శ్రీ శ్రీ సత్య సాయి బాబా వారి దివ్య అపార కృప అనుగ్రహ ప్రేమాశీస్సులతో రంగారెడ్డి జిల్లా శ్రీ సత్యసాయి సేవా సంస్థలు వారు Dec 2020 నుండి 2025 Nov వరకు స్వామి వారి దివ్య ప్రేమతో సత్సంకల్పించుకున్న స్వామివారి 100 వ జన్మ దినోత్సవ వేడుకలలో ఆధ్యాత్మిక కార్యక్రమము లో భాగంగా స్వామి వారి అపార అనుగ్రహ దయతో 100 సార్లు,100 క్షేత్రములలో మహాన్యాస పూర్వక ఏకాదశ రుద్రాభిషేఖం చేయాలనే స్వామి వారి దివ్య ప్రేరణతో సత్సంకల్పం. అందులో భాగంగా తేదీ 19-03-2023 అదివారం నాడు వేద పండితులు ,మరియు వేదము పఠించే మన సాయి కుటుంభ సభ్యులచే 58 వ సామూహిక మహాన్యాస పూర్వక ఏకాదశ రుద్రాభిషేకం శ్రీ సాయీశ్వర మహాదేవుని కి నదీ జలములతో పంచామృతాల తో, పండ్ల రసములతో,పంచ ద్రవ్యముల తో విభూతి తో సుగంధ ద్రవ్యము లతో అభిషేకం జరిగింది ఇందులో మహాన్యాసపూర్వక ఏకాదశ శ్రీ రుద్ర పారాయణము తో అభిషేఖం, బిల్వాష్టకము, లింగాష్టకము,పంచ సూక్త పారాయణములు, శివోపాసన మంత్రం, మరియు మహా నర్మదేశ్వర శివలింగమునకు చక్కటి అలంకారం తో, సప్త హారతులు, భజన మరియు స్వామి వారి అవతార వైభవ సందేశము మరియు భగవాన్ శ్రీ శ్రీ శ్రీ సత్యసాయి బాబా వారికి మహా మంగళ హారతి తో వేడుక ముగించట మైనది. ఈ అపూర్వ ఘట్టాన్ని ఆనంద ఆధ్యాత్మిక కార్యక్రమమును పెద్దపల్లి జిల్లా గోదావరిఖని 8 వ కాలనీలో సమితి మందిరము లో జరిగింది. ఉదయం.09.40.గం.కు స్వామి వారిని పూర్ణకుంభం తో స్వాగతం , జ్యోతి ప్రజ్వలన తో ప్రారంభమై గణపతి పూజ,మహాన్యాసపూర్వక ఏకాదశ రుద్రాభిషేకం కార్యక్రమము మ.3.00 కి పూర్తి అయినది. అత్యంత ఉత్సాహంగా,ఆనందము గా జిల్లా అధ్యక్షులు శ్రీ.వెంకట స్వామి గారు, జిల్లా సమన్వయ కర్తలు , సమితి కన్వీనర్ లు మరియు కొమరం భీమ్ జిల్లా. సభ్యులు,భక్తులు, ఇతర భక్తులు స్థానికంగా సంస్థ లో వివిధ భాద్యతలు నిర్వహించిన పెద్దలు పాల్గొన్నారు. ఇట్టి ఆనంద ఆధ్యాత్మిక వేడుకలో SSSSO రంగారెడ్డి జిల్లా సభ్యులు, మరియు స్థానిక సభ్యులు ,భక్తులు అందరూ కలిసి సుమారు 800 మంది పైగా ప్రత్యక్షంగా అభిషేకం లో పాల్గొన్నారు. మరియు అందరికీ మహాప్రసాదం అందించారు. ఈ పవిత్ర ఆధ్యాత్మిక అభిషేఖం లో ప్రతి ఒక్కరూ పాల్గొని వారి పవిత్ర భక్తి హృదయాలతో స్వామి వారిని ప్రత్యక్షంగా అభిషేకించి శ్రీ సాయి మహాదేవ భగవానుని దివ్య కృపా కటాక్షమునకు, పాత్రులయ్యామని,ఇంత చక్కటి ఆనంద వేడుక చేసుకున్నామని స్వామి వారు మంచి అవకాశము ఇచ్చారని ఎందరో సంతోషం వ్యక్తపరిచారు.. ఇంత చక్కటి ఆనంద వేడుక చేసుకోవడానికి అవకాశమిచ్చి, ప్రత్యక్ష దివ్య ఆనంద అనుభూతి కలిగించి, మనలో,మనతో ఉండి విజయవంతము అందించిన మన బంగారు తండ్రి పరిపూర్ణావతారి హృదయవాసి, సకల దేవతాతీత స్వరూప భగవాన్ శ్రీ శ్రీ శ్రీ సత్య సాయి బాబా వారి దివ్య పాద శ్రీ చరణములకు కృతజ్ఞతా పూర్వక అనంత కోటి వందనము లు సమర్పించు కుంటున్నాము. సామూహిక నామ స్మరణ ,రుద్ర పారాయణము, ఇంత చక్కటి అనేక వేదికలు,సాయి కేంద్రముల ద్వారా ఎంతో మంది అనేక కొత్త వారిని కలుసుకునే చక్కటి మహా అవకాశము స్వామి వారు కల్పిస్తున్నారు... ఇంత చక్కటి వేడుకకు చక్కటి ఏర్పాట్లు చేసి స్వామి వారిపై భక్తి విశ్వాసములతో వేదిక చక్కటి అలంకరణ, స్వామి వారు నచ్చేలా,మెచ్చేలా అందరూ ఐక్యతతో ప్రేమతో భక్తితో పాల్గొని, ప్రేమావతారి భగవాన్ శ్రీ శ్రీ శ్రీ సత్యసాయి బాబా వారి దివ్య కృపకు పాత్రులయ్యామని, స్వామి వారి దయతో మంచిగా అందరి సాయి హృదయ బంధువులతో కలిసి వేడుక చేసుకున్నామని జిల్లా అధ్యక్షులు గారు ,కన్వీనర్ గారు పెద్దలు,బాధ్యులు,ముఖ్యంగా మహిళా సభ్యులు ఆనందం, సంతోషం వ్యక్తపరిచారు.. వేదిక, చక్కటి అలంకారంతో, చక్కటి ఏర్పాట్లు తో మరియు అందరి భక్తులకు మహా ప్రసాదము తో ఏర్పాట్లు చేసిన సంస్థ భాద్యులు సభ్యులు,మహిళలు,యువత, వారి కుటుంభ సభ్యుల కు స్వామి వారి కృప,దయ అనుగ్రహ ఆశీస్సులు దండిగా మెండుగా అందిస్తారని స్వామి వారిని హృదయపూర్వకంగా మనస్ఫూర్తిగా ప్రార్థిస్థూ ఇందులో పాల్గొన్న ప్రతి ఒక్కరికీ పేరు పేరునా హృదయ పూర్వక శుభ వందనములు. సాయిరాం🙏🙏🙏🙏 *********** 03.03.2023 నుండి జూన్ 08 వరకు పరమ పవిత్ర శ్రీ గాయత్రి మంత్రము సామూహికంగా 98 రోజులు అఖండ నామ పారాయణ 25 కోట్ల జప యజ్ఞము జూన్ 9,10,11/2023 నాడు మహా పూర్ణాహుతి --------------------- -- ----------------- 59 వ ది తేదీ.26.03.23 ఆదివారం నాడు గద్వాల జిల్లా స్థానిక మందిరము లో మహాన్యాస పూర్వక ఏకాదశ రుద్రాభిషేకం 60 వ ధి ఏప్రిల్ 16 ఆదివారం నాడు మహబూబాబాద్ జిల్లా లో మహాన్యాస పూర్వక ఏకాదశ రుద్రాభిషేకము. 61 వధి May 07 ,2023 ఆదివారం నాడు కొమరం భీమ్ జిల్లా కాగజ్ నగర్ సమితి ద్వారా మహాన్యాస పూర్వక ఏకాదశ రుద్రాభిషేకం. 62 వ ధి తేదీ.21.05.2023 నాడు మహాన్యాస పూర్వక ఏకాదశ రుద్రాభిషేకం*. 63 తేదీ.28.05.2023 ఆదివారం నాడు సిద్దిపేట జిల్లా స్థానిక మందిరం లో మహాన్యాస పూర్వక ఏకాదశ రుద్రాభిషేకం ********** పరిపూర్ణ ప్రేమావతారి భగవాన్ శ్రీ శ్రీ శ్రీ సత్యసాయి బాబా వారి దివ్య అనుగ్రహ ఆశీస్సులు తో స్వామి వారి సహర్ష నామావళి తో అందులోని నామము వచ్చేలా 1008 పాటల భజన మాల ను స్వామి వారి దివ్య పాదముల చెంత సమర్పణ కార్యక్రమము *తే:31.05.23 బుదవారం నుండి తే: 04.06.23 ఆదివారం వరకు, 5 రోజులు ప్రతి రోజు ఉ.ము 5.00 కు ఓంకారం సుప్రభాతం,నగర సంకీర్తన హారతి. ఉ. 6.00 నుండి సా. 7.00 వరకు ప్రతి రోజు 200 పాటల భజన కార్యక్రమము . ఆదివారం నాడు 208 పాటలు అన్నీ కలిపి 1008 పాటల సమర్పణ.. ప్రతి రోజు నిర్ణయించిన భజనలు తెలియ చేయబడుతాయి.. పూర్తి వివరములు తెలియచేయ బడుతుంది. *********** తేదీ.9,10,11.జూన్ 2023 నాడు పరమ పవిత్ర శ్రీ గాయత్రీ మంత్ర 98 రోజుల అఖండ పారాయణం యజ్ఞము మహపూర్ణహుతి.. 64 తేదీ.18.06.23 ఆదివారం నాడు నిర్మల్ జిల్లా లో మహాన్యాస పూర్వక ఏకాదశ రుద్రాభిషేకం 65 వ ధి తేదీ 25.06.2023 ఆదివారము నాడు నాగర్ కర్నూల్ జిల్లా బిజినేపల్లి లో మహాన్యాస పూర్వక ఏకాదశ రుద్రాభిషేకం. 66 వది 02.07.2023 ఆదివారం నాడు మెదక్ జిల్లా లో మహాన్యాస పూర్వక ఏకాదశ రుద్రాభిషేకం.... జూలై 15,16,17 నాడు రంగారెడ్డి జిల్లా లో భగవాన్ శ్రీ శ్రీ శ్రీ సత్యసాయి బాబా వారి దివ్య అనుగ్రహ ఆశీస్సులు తో వారి దివ్య అధ్యక్షతన జరుగుతున్న సనాతన భాగవత భక్త సమాజం వారిచే ఈ 3 రోజులు దేవతా మూర్తుల కళ్యాణ మహోత్సవం 67 వది 23.07.2023 ఆదివారం నాడు వికారాబాద్ జిల్లా స్థానిక మందిరము లో మహాన్యాస పూర్వక ఏకాదశ రుద్రాభిషేకం. 68 వది 06.08.2023 ఆదివారం నాడు జగిత్యాల జిల్లా మెట్ పల్లి మందిరం లో మహాన్యాస పూర్వక ఏకాదశ రుద్రాభిషేకం.. 69 వది తేదీ.20.08.2023 ఆదివారం నాడు వరంగల్ జిల్లా హన్మకొండ మందిరము లో మహా రుద్రాభిషేకం 70 27.08.2023 ఆదివారం నాడు గోదావరిఖని లో మహాన్యాస పూర్వక ఏకాదశ రుద్రాభిషేకం ... 10.09.2023 ఆదివారం నాడు మహిళల చే సౌభాగ్య కుంకుమార్చన కార్యక్రమము 71 వది 24.09.2023 ఆదివారం నాడు మహాన్యాస పూర్వక ఏకాదశ రుద్రాభిషేకం... లిఖిత నామ జప యజ్ఞం 41 రోజులు (Oct మరియు Nov లో ) 72 వది 08.10.2023 ఆదివారం నాడు ఖమ్మం జిల్లా నేలకొండపల్లి మందిరం లో మహాన్యాస పూర్వక ఏకాదశ రుద్రాభిషేకం. ------------------------------------------- తేదీ:15.10.23 ఆదివారం నాడు రంగరెడ్డి జిల్లా అన్ని సమితిల వారిచే సేవాదళ్ శిక్షణా శిబిరం. 73 29.10.2023 ఆదివారం నాడు మహాన్యాస పూర్వక ఏకాదశ రుద్రాభిషేకం... 74 05.11.2023 ఆదివారం నాడు సంగారెడ్డి జిల్లా నారాయణ ఖేడ్ లో మహాన్యాస పూర్వక ఏకాదశ రుద్రాభిషేకం.. 75 వది 03.12.2023 ఆదివారం నాడు పవిత్ర కార్తీక మాసము నెలలో భగవాన్ బాబా వారు నడయాడిన పరమ పవిత్ర శివం మందిరం ప్రాంగణంలో మహాన్యాస పూర్వక ఏకాదశ రుద్రాభిషేకం... 76 వది 10.12.2023 ఆదివారం నాడు సంగారెడ్డి జిల్లా స్థానిక మందిరంలో మహాన్యాస పూర్వక ఏకాదశ రుద్రాభిషేకం.... ఈ విధంగా మహాన్యాస పూర్వక ఏకాదశ రుద్రాభిషేఖం లు మరియు ఇతర ఆధ్యాత్మిక కార్యక్రమములు ప్రస్తుతానికి నిర్ణయం అనుకోవటం జరిగింది. __________ పటాన్ చెరు,జోగిపేట,,వర్గల్, కొల్లాపూర్, చర్లపల్లి (WRL.R) ,శ్రీరాముల పల్లి,లో కూడా త్వరలో తేదీ నిర్ణయించ బడుతుంది. స్వామి వారి శత జన్మదిన వేడుకలు లో బాగంగా Sep..10 ఆదివారం నాడు 1008 మహిళలచే సౌభాగ్య కుంకుమార్చన ప్రత్యేక అధ్యాత్మిక కార్యక్రమము. __________ , ఇందులో పైన తెలియచేసిన తేదీలు అప్పటి పరిస్థితుల లో ఏదేని మార్పులు ఉంటే,అనగా సంస్థ వివిధ విభాగముల రాష్ట్ర కార్యక్రమము లను బట్టి మార్పులు ఉంటే తెలియచేయబడుతుంది. 🙏 సాయిరాం🙏 సదా శ్రీ సాయి సేవలో అధ్యక్షులు శ్రీ సత్యసాయి సేవా సంస్థలు రంగారెడ్డి జిల్లా,తెలంగాణ