పరిపూర్ణ ప్రేమావతారి భగవాన్ శ్రీ శ్రీ శ్రీ సత్యసాయి బాబా వారి దివ్య అనుగ్రహ ఆశీస్సులు తో వారి దయతో వారి ప్రేరణతో సత్సంకల్పంతో ఏర్పాటు చేసుకున్న స్వామి వారి శత జన్మదిన వేడుకల్లో భాగంగా జరుగుతున్న 100 క్షేత్రములలో 100 మహాన్యాస పూర్వక ఏకాదశ రుద్రాభిషేకం లలో బాగంగా ఇప్పటివరకు 49 రుద్రాభిషేకము లు పూర్తి అయ్యాయి. ఈ రోజు జనవరి 01 వ తేదీ ఆదివారం నాడు నూతన ఆంగ్ల సంవత్సర ప్రారంభ దినం న *50 వ ఏకాదశ రుద్రాభిషేకం శ్రీ సత్య సాయి సేవా సంస్థలు సిరిసిల్ల జిల్లా ఆధ్వర్యం లో శ్రీ సత్య సాయి సేవా సమితి వేములవాడ సహకారం తో వేములవాడ పుణ్యక్షేత్రము లో శ్రీ సత్య సాయి సేవా సంస్థలు రంగారెడ్డి జిల్లా వారి సహకారం తో స్థానిక హరిహర ఫంక్షన్ హాల్ వేములవాడ లో నిర్వహించబడింది. ఇట్టి కార్యక్రమం ఉ.8.30..9.40 కు పల్లకీ ఉత్సవము స్థానిక శ్రీ సత్య సాయి సేవా మందిరం వేములవాడ నుండి ఫంక్షన్ హాల్ వరకు నిర్వహించబడింది. తదుపరి ఉ. 9.40 ని.నుండి దంపతుల చే గణపతి పూజ, మహాన్యాసము, ఏకాదశ రుద్ర పారాయణం, రుద్రాభిషేకము ,పంచ సూక్త పారాయణములు, అభిషేకములు సంస్థ లో సాయి కుటుంబ సభ్యులు, స్థానిక భక్తులు, రాష్ట్రం లోని నలు మూల నుండి సుమారు 500 మంది భక్తులచే నిర్వహించ బడినది. నర్మద బాణ శివలింగమునకు అలంకరణ, భజన, సప్త హారతులు, స్వామి వారి మహా మంగళ హారతుల సమర్పణ జరిగినది. తదుపరి స్వామి వారి సందేశము, మహాప్రసాదం అందజేయడం జరిగినది. ఇందులో ఆత్మీయ సంస్థ రాష్ట్ర పెద్దలు, వివిధ జిల్లా పెద్దలు, బాధ్యులు , వివిధ సమితిల బాధ్యులు , భక్తులు, యువత, మహిళలు పాల్గొన్నారు. ఇట్టి సామూహిక ఆధ్యాత్మిక కార్యక్రమం సంపూర్ణంగా నిర్వహించడం లో పాలు పంచుకున్న ప్రతి ఒక్క సాయి కుటుంబ సభ్యులకి, సహకరించిన ప్రతి ఒక్కరికీ పేరు పేరున ప్రతి ఒక్కరికీ ప్రేమపూర్వక కృతజ్ఞతలు సదా సాయి సేవలో శ్రీ సత్య సాయి సేవా సంస్థలు రాజన్న సిరిసిల్ల * జై సాయిరాం*🙏🙏