వ్యాసరచన పోటీ విజేతలకు బహుమతి ప్రధానం 🔺 శ్రీ సత్యసాయి సేవా సంస్థలు, తెలంగాణా రాష్ట్ర వ్యాప్త కార్యక్రమంలో భాగంగా "భగవాన్ శ్రీ సత్యసాయి సేవా సమితి, జగిత్యాల" ఆధ్వర్యంలో నిర్వహించిన వ్యాస రచన పోటీలలో ప్రతి స్కూల్ మరియు కాలేజీ ల నుండి ఇద్దరు విజేతలకు బహుమతి ప్రధానం చేయబడింది. జగిత్యాల చుట్టుపక్కల నుండి దాదాపు 90 స్కూల్స్ మరియు 20 కాలేజీల నుండి దాదాపు 3,000 మంది విద్యార్థులు ఈ వ్యాస రచన పోటీలలో పాల్గొనడం జరిగింది. 🌟 గౌరవనీయులు మున్సిపల్ చైర్ పర్సన్ శ్రీమతి బోగ శ్రావణి ప్రవీణ్ గారు విశిష్ట అతిథిగా పాల్గొని వారి చేతుల మీదుగా విద్యార్థులకు బహుమతి మరియు సర్టిఫికెట్స్ ప్రదానం చేయడం జరిగింది, అలాగే కౌన్సిలర్ శ్రీ కప్పల శ్రీకాంత్ గారు , AD శ్రీ శివకృష్ణ గారు పాల్గొన్నారు పిల్లలకు ఇచ్చిన టాపిక్స్ "మానవ సేవయే మాధవ సేవ" మరియు "21వ శతాబ్దంలో మానవతా విలువల పాత్ర" అనునవి చాలా ముఖ్యమైనవి అని, విద్యార్థులలో ఉన్నత విలువలు పెంపొందించేవిగా వున్నాయి అని , ఇంత మంచి కార్యక్రమాన్ని రూపొందించిన సంస్థ సభ్యులను వారు అభినందించడం జరిగింది. సంస్థ తరపున జ్ఞాపిక మరియు శాలువాతో అతిథిని సత్కరించడం జరిగింది. ఇట్టి కార్యక్రమంలో పాల్గొన్న సేవాదళ్ సభ్యులందరికి ముఖ్యంగా మండలాల బాధ్యత తీసుకొని పోటీ నిర్వహించి బహుమతుల ప్రదానం వరకు కోఆర్డినేట్ చేసిన ఇంచార్జి సభ్యులకు స్వామి వారి సంపూర్ణ అనుగ్రహ ఆశీస్సులు నిండుగా ఉండాలని మనసారా ప్రార్థిస్తున్నాం. జై సాయిరాం 🙏🙏🙏🙏 భగవాన్ శ్రీ సత్యసాయి సేవా సమితి, జగిత్యాల