🙏 ఓం శ్రీ సాయిరాం 🙏 సాయిరాం Sir,. నిన్నటి రోజున అనగా(18-09-2022)ఆదివారం వనపర్తి జిల్లా శాఖపూర్ భజన మండలి ద్వారా శాఖాపూర్ గ్రామములో స్వామి వారి ఆశీస్సులతో ఉచిత కంటి వైద్య శిభిరం నిర్వహించడం జరిగినది. ఈ కంటి వైద్య శిభిరం లో 242మంది పేషంట్స్ కు కంటి పరీక్షలు నిర్వహించి ఇందులో 151మంది పేషంట్స్ కు కంటి అద్దములు మరియు Drops ఇవ్వడం జరిగినది. ఇందులో 85మంది పేషంట్స్ కు Catract ఆపరేషన్ అవసరం ఉన్నదని నిర్ణయించనైనది. ఈ కార్యక్రమములో 20మంది పురుష సేవాదల్ మరియు 3 మహిళా సేవాదళ్ పాల్గొన్నారు. ఈ యొక్క CAMP సాయంత్రం 4: 00 గం "లకు స్వామి వారి హారతి తో ముగింపు చేయడం జరిగినది. అదే విధంగా 30 మంది బాలవికాస్ విద్యార్థిని విద్యార్థులకు Note books,pencils, erasers , Biscuits అందించడం జరిగినది.