ఓం శ్రీ సాయిరాం శ్రీ సత్యసాయి సేవా సంస్థలు ఖమ్మం జిల్లా తెలంగాణా రాష్ట్రం * భగవాన్ శ్రీ సత్యసాయిబాబా వారి దివ్య అనుగ్రహ ఆశీస్సులతో... 23/9/2022 శుక్రవారం ఉదయం 9.00 గంటలనుండి సాయంత్రం 4.00 గంటల వరకు నేలకొండపల్లిలో మందిర ప్రాంగణంలో క్యాన్సర్ వ్యాధులగురించి అవగాహన సదస్సు మరియు కాన్సర్ నిర్ధారణ వైద్య పరీక్షలు నిర్వహించబడినవి.. ఈ కార్యక్రమంలో హైదరాబాద్ MNJ హాస్పిటల్ వారి సౌజన్యముతో 20 మంది ప్రముఖ వైద్య నిపుణులబృందము పరీక్షా పరికరాలతో వచ్చి వైద్య శిబిరం నిర్వహించారు. క్యాన్సర్ వ్యాధి గురించి అవగాహన కలిగించి నిర్ధారణ పరీక్షలు నిర్వహించారు.. 130 మంది మహిళలు ఇట్టి ఉచిత వైద్య సేవలు పొందారు.. 14మందిని detect చేసి followup treatment కొరకు నిర్ధారణ చేయుట జరిగినది. ఈ విశిష్ట సేవాకార్యక్రంలో శ్రీ రవీంద్రనాధ్ ఠాకూర్ గారు ప్రశాంతి నిలయం సేవకులు వైద్యబృందంతో పాటు వచ్చి సేవలు అందించారు. ఇంకా జిల్లా సేవాదళ్ సభ్యులు తగిన సేవలు, సహకారం అందించారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షులు, జిల్లా సేవాదళ్ కోఆర్డినేటర్, జిల్లా మహిళా ఇంచార్జ్, ఇతర విభాగాల జిల్లా కోఆర్డినేటర్లు జిల్లా ఇంచార్జెస్/సమితి కార్యవర్గ సభ్యులు, సమితి/భజనమండలి కన్వీనర్లు, యూత్ సభ్యులు, మహిళా సభ్యులు పాల్గొన్నారు., సాయిరాం🙏 జిల్లా ఆఫిస్ ఇంచార్జ్ శ్రీ సత్యసాయి సేవా సంస్థలు ఖమ్మం జిల్లా..