ఓం శ్రీ సాయిరాం 🙏🏽 జిల్లా స్థాయి సమీక్షా సమావేశం భగవాన్ శ్రీ సత్య సాయి బాబా వారి అనుగ్రహ ఆశీస్సులు చే ఈ రోజు తేదీ 07-8-2022 ఆదివారం,ఉదయం 10.30am ల నుండి మ.1.30 శ్రీ సత్య సాయి సేవా మందిరం సిరిసిల్ల లో జిల్లా incharge శ్రీ CH. రవికిరణ్, రాష్ట్ర DM కో ఆర్డినేటర్ గారు, రాష్ట్ర మహిళా యూత్ కో ఆర్డినేటర్ శ్రీమతి నాగ జ్యోతి గారల ఆధ్వర్యం లో "జిల్లా స్థాయి సమీక్షా సమావేశం" నిర్వహించడం జరిగింది.* ఇట్టి కార్యక్రమం లో శ్రీ రవి కిరణ్ గారు మాట్లాడుతూ సమితి స్థాయి, భజన మండలి స్థాయి లో నిర్వహించ వలసిన కనీస కార్యక్రమాలను తప్పని సరిగా ప్రతి సమితి, భజన మండలి నిర్వహించాలని తెలియజేశారు. అందరూ మళ్లీ మూలాల్లోకి వెళ్ళాలని, సంస్థ నియమాల ననుసరించి చక్కని క్రమ శిక్షణ తో, సమయ పాలన తో స్వీయ ఉద్ధరణ కోసం మాత్రమే సంస్థ కార్యక్రమాలు నిర్వహించాలని, ప్రతి సాయి యువత అన్ని విభాగాల లో చక్కటి నైపుణ్యాన్ని అభివృద్ధి చేసుకోవాలని, గృహ భజనలు, నగర సంకీర్తనల లో యువత పాల్గొంటే వారి స్థాయి పెరుగుతుందని, డిసాస్టర్ మనేజిమెంట్ శిక్షణ తప్పని సరిగా అందరూ తీసుకోవాలని తెలియజేశారు. ఇందులో రాష్ట్ర మహిళా యూత్ కో ఆర్డినేటర్ గారు శ్రీమతి నాగ జ్యోతి గారు మాట్లాడుతూ మహిళా , మహిళా యూత్ సభ్యులకు ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేసి అందరినీ స్వామి వారి ప్రేమ తత్వం గూర్చి అద్భుతంగా తెలియజేశారు. స్వామి వారి సేవ వల్లంకలిగే ప్రయోజనం, సత్య సాయి మహిళా యువత చేస్తున్న కార్యక్రమాలు, భవిష్యత్తులో చేయ వలసిన కార్యక్రమాల గూర్చి ప్రేరణ కలిగించారు. ఇందులో జిల్లా అద్యక్షులు, జిల్లా ఇంఛార్జిలు, సిరిసిల్ల వేములవాడ, బొప్పపుర్, తంగల్లపల్లీ సమితి కన్వీనర్ లు, సమితి ఇంచార్జీ లు, మహిళలు, యువత , క్రియాశీలక సభ్యులు పాల్గొన్నారు. ఇట్టి సమావేశాల్లో జిల్లా స్థాయి అన్ని విభాగాల కో ఆర్డినేటర్స్ , సిరిసిల్ల సమితి, వేములవాడ సమితి, బొప్పాపూర్ సమితి, తంగల్లపల్లి సమితి కన్వీనర్ లు , అన్ని విభాగం ల కో ఆర్డినేటర్ లు, ఆక్టివ్ సేవాదల్ సభ్యులు పురుషులు, మహిళలు సుమారు 30 మంది మహిళలు, 35 మంది పురుషులు పాల్గొన్నారు. అందరికీ స్వామి వారి దివ్య అనుగ్రహ ఆశీస్సులు ఏళ్ల వేళలా దండిగా ఉండాలని ప్రార్థిస్తూ ఇట్టి అవకాశం కలిగించినందుకు స్వామి వారికి కృతజ్ఞతాభి వందనములు. సదా స్వామీ సేవలో జై సాయిరాం శ్రీ సత్య సాయి సేవా సంస్థలు రాజన్న సిరిసిల్ల జిల్లా