అందరికీ సాయిరాం తేది.26.07.2022 మంగళవారం నాడు శ్రీ సత్యసాయి సేవా సమితి, రేగొండ గ్రామములో మన జిల్లాకు నియమించబడిన జిల్లా ఇంఛార్జి శ్రీ A భాస్కర్ గారితో జిల్లా స్థాయి సమావేశమును నిర్వహించడం జరిగింది. జిల్లా లోని భజన మండలి కన్వీనర్లు, సమితి కన్వీనర్లు, జిల్లా కోఆర్డినేటర్లు, సాయి యూత్ సభ్యులు, బాల్ వికాస్ గురువులు ఈ సమావేశమునకు హాజరు అయ్యారు. ఉదయం 09.30 గంటల నుండి భజన మండలి కన్వీనర్ ల రిపోర్ట్, సమితి కన్వీనర్ ల రిపోర్ట్, జిల్లా కోఆర్డినేటర్ ల రిపోర్ట్ మరియు జిల్లా అధ్యక్షుల సమీక్ష చేయడం జరిగింది. మన నూతన జిల్లా ఇంఛార్జి తో ముఖ్య విషయాల సమీక్ష జరిపి భజనలు, నగర సంకీర్తన లు, బాల్ వికాస్ తరగతులకు పిల్లలను పంపడం చేస్తూ సేవా కార్యక్రమాలు ప్రారంభించు కుందామని అందరూ సంకల్పం చేయడం జరిగింది. దాదాపు 23 మంది జెంట్స్ , 19 మంది స్త్రీలు, 6 గురు జెంట్స్ సాయి యూత్, 8 మంది సాయి మహిళల యూత్ మరియు ఇద్దరు బాల్ వికాస్ పిల్లలు హాజరై ఈ సమావేశాన్ని విజయవంతం చేసి, భగవాన్ శ్రీ సత్యసాయి బాబా వారి దివ్య అనుగ్రహ ఆశీస్సులకు పాత్రులు అయ్యారని సంతోషం తో తెలియ జేస్తూ..... మీ Ch మల్లా రెడ్డి, జిల్లా అధ్యక్షులు, శ్రీ సత్యసాయి సేవా సంస్థలు భూపాలపల్లి జయశంకర్ జిల్లా తెలంగాణ...