ఓం శ్రీ సాయిరాం🙏 భగవానుని దివ్యపాద పద్మాలకు ప్రణమిల్లుతూ అందరికి సాయిరాం భగవానుని దివ్యాశిశులతో నిన్న తేదీ 27/4/3022 రోజు ఈశ్వరమ్మ డే వేడుకల్లో భాగంగా గోదావరిఖని లోని పి.కె రామయ్య కాలనీ ( గత కొన్ని సంవత్సరాలుగా వలస వచ్చి స్థిరపడిన ఒరిస్సా కూలీల కాలనీ) లోని నిరుపేద విద్యార్థిని విద్యార్థుల కొరకు ఆ ప్రాంత సేవాదళ్ రఘునాథ్ సింగ్ గారు కోరగా శ్రీ సత్యసాయి బాలవికాస్ వేసవి శిక్షణా తరగతులు ప్రారంభము చేసుకోవటం జరిగినది.ఆక్కడి విద్యార్థులకు మంచి అలవాట్లు , పరిశుభ్రత గురుంచి తెలియజేసి, బాలవికాస్ ఆవశ్యకత తెలిపి , ప్రభాత ప్రార్ధన తెలియజేసి విద్యార్థులకు రోజు తరగతిలో వ్రాసుకొనుటకు నోట్ బుక్స్ , పెన్స్, ,స్వామి వారి చిత్రపఠములను, విభూతి పాకెట్స్ ను స్వీట్స్ స్వామి వారి ప్రసాదంగా అందజేయబడినది. ఇట్టి బాలసేవలో జిల్లా అధ్యక్షులు , జిల్లా సేవాదళ్ కోఆర్డినేటర్ , జిల్లా ఆధ్యాత్మిక కో ఆర్డినేటర్ , పెద్దపల్లి సమితి కన్వీనర్, గోదావరిఖని సమితి సేవాదళ్ , బాలవికాస్ గురువులు, స్త్రీ పురుష సేవాదళ్ మొత్తం 15 మంది, విద్యార్థులు 30 మంది పాల్గొన్నారు*. స్వామి వారు అందరికి అపార ఆనుగ్రహ ఆశిశులు అందివ్వాలని మనఃస్ఫూర్తిగా కోరరుకుంటూ........ జై సాయిరాం సదా సాయి సేవలో.......... శ్రీ సత్యసాయి విద్యా విభాగం, పెద్దపల్లి జిల్లా. శ్రీ సత్యసాయి సేవా సంస్థలు, పెద్దపల్లి జిల్లా. 🙏🙏🙏🙏