ఓం శ్రీ సాయిరాం🙏 భగవాన్ శ్రీ శ్రీ శ్రీ సత్య సాయి బాబా వారి దివ్య అపార కృప అనుగ్రహ ప్రేమాశీస్సులతో రంగారెడ్డి జిల్లా శ్రీ సత్యసాయి సేవా సంస్థలు ద్వారా Dec 2020 నుండి 2025 Nov వరకు జరుపుకునే స్వామివారి (100 వ జన్మదిన) శత జయంతి ఉత్సవాల వేడుకలలో ఆధ్యాత్మిక కార్యక్రమము లో భాగంగా స్వామి వారి అపార అనుగ్రహ ప్రేమతో 100 సార్లు,100 క్షేత్రములలో మహాన్యాస పూర్వక ఏకాదశ రుద్రాభిషేఖం చేయాలనే సత్సంకల్పం. అందులో భాగంగా తేదీ 20-03-2022 అదివారం నాడు వేద పండితులు ,మరియు వేదము పఠించే మన సాయి కుటుంభ సభ్యులచే 26 వ సామూహిక మహాన్యాస పూర్వక ఏకాదశ రుద్రాభిషేకం శ్రీ సాయీశ్వర మహాదేవుని కి నదీ జలములతో, పంచామృతాల తో, పండ్ల రసములతో, పంచద్రవ్యములతో,విభూతితో సుగంధ ద్రవ్యములతో అభిషేకం జరిగింది ఇందులో మహాన్యాసపూర్వక ఏకాదశ శ్రీ రుద్ర పారాయణము తో అభిషేఖం, బిల్వాష్టకము, లింగాష్టకము, శ్రీ సూక్తము, పురుష సూక్త పారాయణము, శివోపాసన మంత్రం, మరియు మహాశివ లింగమునకు చక్కటి అలంకారం తో, సప్త హారతులు, భజన మరియు స్వామి వారి అవతార వైభవ సందేశము, భగవాన్ శ్రీ శ్రీ శ్రీ సత్యసాయి బాబా వారికి మహా మంగళ హారతి తో వేడుక ముగించటమైనది. ఈ అపూర్వ ఘట్టాన్ని ఆనంద ఆధ్యాత్మిక కార్యక్రమమును కరీంనగర్ జిల్లా లో గల స్థానిక భజన మందిరము లో జరిగింది. ఉదయం.09.15 గం.కు ప్రారంభమై మధ్యాహ్నం 02.30 గం.ల వరకు నిర్వహించ బడినది........ అత్యంత ఉత్సాహంగా, ఆనందముగా అనేక మంది భక్తులు, చుట్టు వుండే వివిధ జిల్లాల సంస్థ సభ్యులు, పెద్దలు, పాల్గొన్నారు. ఇట్టి ఆనంద ఆధ్యాత్మిక వేడుకలో SSSSO రంగారెడ్డి జిల్లా సభ్యులు,మరియు స్థానిక సభ్యులు అందరూ కలిసి సుమారు 1000 మంది పైగా ప్రత్యక్షంగాఅభిషేఖంలో పాల్గొన్నారు. మరియు అందరికి మహాప్రసాదం అందించారు. ఈ పవిత్ర ఆధ్యాత్మిక అభిషేఖం లో ప్రతి ఒక్కరూ పాల్గొని వారి పవిత్ర భక్తి హృదయాలతో స్వామి వారిని ప్రత్యక్షంగా అభిషేకించి శ్రీ సాయి మహాదేవ భగవానుని దివ్య కృపా కటాక్షమునకు, పాత్రులయ్యామని,చాలా రోజుల తర్వాత మందిరములో పూర్వ వైభవం కనిపించింది అని ఎందరో సంతోషం వ్యక్తపరిచారు.. ఇంత చక్కటి ఆనంద వేడుక చేసుకోవడానికి అవకాశమిచ్చి, ప్రత్యక్ష దివ్య ఆనంద అనుభూతి కలిగించి, మనలో,మనతో ఉండి విజయవంతము అందించిన మన బంగారు తండ్రి పరిపూర్ణావతారి హృదయవాసి, సకల దేవతాతీత స్వరూప భగవాన్ శ్రీ శ్రీ శ్రీ సత్యసాయి బాబా వారి దివ్య పాద శ్రీ చరణములకు కృతజ్ఞతా పూర్వక అనంత కోటి వందనములు సమర్పించు కుంటున్నాము. సామూహిక నామ స్మరణ ,రుద్ర పారాయణము, ఇంత చక్కటి అనేక వేదికలు,సాయి కేంద్రముల ద్వారా ఎంతో మంది అనేక కొత్త వారిని కలుసుకునే చక్కటి మహా అవకాశము స్వామి వారు కల్పిస్తున్నారు... ఇంత చక్కటి వేడుకకు కరీంనగర్ జిల్లా DP గారు,సమితి కన్వీనర్ , ఇతర సభ్యులు, యువత , మహిళా సభ్యులు కొద్దీ రోజుల వ్యవధి లోనే చక్కటి ఏర్పాట్లు చేసి స్వామి వారిపై భక్తి విశ్వాసములతో మందిరము,వేదిక చక్కటి అలంకరణ, స్వామి వారు నచ్చేలా,మెచ్చేలా అందరూ ఐక్యతతో ప్రేమతో భక్తితో పాల్గొని ప్రేమావతారి భగవాన్ శ్రీ శ్రీ శ్రీ సత్యసాయి బాబా వారి దివ్య కృపకు పాత్రులయ్యామని, చాలా రోజుల తర్వాత ఒక గొప్ప కార్యక్రమము స్వామి వారి దయతో మంచిగా అందరి సాయి బంధువులతో కలిసి చేసుకున్నామని ఆనందం, సంతోషం వ్యక్తపరిచారు.. వేదిక, చక్కటి అలంకారంతో, చక్కటి ఏర్పాట్లు తో మరియు అందరి భక్తులకు మహా ప్రసాదముతో ఏర్పాట్లు చేసిన సంస్థ అందరి సభ్యులు,మహిళలు, యువత, వారి కుటుంభ సభ్యుల కు స్వామి వారి కృప,దయ అనుగ్రహ ఆశీస్సులు దండిగా మెండుగా అందిస్తారని స్వామి వారిని హృదయపూర్వకంగా మనస్ఫూర్తిగా ప్రార్థిస్థూ ఇందులో పాల్గొన్న ప్రతి ఒక్కరికీ పేరు పేరునా హృదయ పూర్వక శుభ వందనములు. సాయిరాం🙏🙏🙏🙏 ★★★★★★◆★★★ 27 వది తేదీ. 27.03.2022 ఆదివారం నాడు మహాబాబా నగర్ జిల్లా వెన్నాచేడు సమితి మందిరము లో 28 వది 14.04.2022 స్థానిక అబ్దుల్లాపూర్ మెట్ భజన మండలి ద్వారా మహా రుద్రాభిషేఖం.. 29 17.04.2022 సిద్ధిపేట జిల్లా స్థానిక సమితి మందిరము లో 30 వది, 01.05.2022 సూర్యాపేట జిల్లా కోటపహాడ్ సమితి ద్వారా 31 08.05.2022 నాడు వనపర్తి జిల్లా స్థానిక మందిరములో మహా రుద్రాభిషేఖం.. 32 వది.15.05.2022.కొత్తకోట భజన మండలిలో వనపర్తి జిల్లా లో మహా రుద్రాభిషేఖం తేదీ.25.05.2022 బుధవారం శ్రీ హనుమజ్జయంతి నాడు 108 సార్లు హనుమాన్ చాలీసా పారాయణముతో శ్రీ రామ భక్త, హనుమంతుతుడికి మహా అభిషేఖం (సుమారు 8 గంటలు పైగా) . 33 వది 29.05.2022 నాడు నిజామాబాదు జిల్లా స్థానిక సమితి మందిరములో మహా రుద్రాభిషేఖం 34 వది 05.06.2022 ఆదివారం నాడు సిద్ధిపేట జిల్లా గజ్వెల్ మందిరము లో జూన్ 11,12 నాడు శ్రీ గాయత్రి దశ కోటి నామ పారాయణ యజ్ఞ పూర్ణాహుతి 35 వది 19.06.2022 నాడు జగిత్యాల జిల్లా జగిత్యాల మందిరంలో 36 వది 03.07.2022 నాడు రాజన్న సిరిసిల్ల జిల్లా స్థానిక మందిరములో 37 వది 10.07.2022 నాడు నల్గొండ జిల్లా నకిరేకల్ మందిరములో 38 వది 17.07.2022 నాడు రాజన్న సిరిసిల్ల జిల్లా తంగడిపల్లి మందిరములో 39 వది. 21.08.2022 నాడు నల్గొండ జిల్లా మాల్ మందిరములో 40 వది 04.09.2022 నాడు రంగారెడ్డి జిల్లా లోని ప్రసిద్ధ చండీ మాత దివ్య యజ్ఞ క్షేత్రములో 41 వది తేదీ.11.09.2022 నాడు కరీంనగర్ జిల్లా జమ్మికుంట లో మహా రుద్రాభిషేఖం. 42 వది తేదీ.18.09.2022 నాడు మహా రుద్రాభిషేఖం. 43 వది.తేదీ.02.10.2022 నాడు నల్గొండ జిల్లా చెరుకుపల్లి భజన కేంద్రములో. 44 వది. తేదీ.09.10.2022 నాడు కరీంనగర్ జిల్లా హుజూరాబాద్ క్షేత్రములో మహా రుద్రాభిషేఖం. 45 వది.తేదీ.16.10.2022 సిద్ధిపేట జిల్లా వర్గల్ మందిరములో 46 వది తేదీ. 30.10.2022 నాడు మహా రుద్రాభిషేఖం. 47 వది.తేదీ. 06.11.2022 నాడు మహా రుద్రాభిషేఖం 48 వది. తేదీ.04.12.2022 నాడు మహా రుద్రాభిషేఖం. 49 వది తేదీ.11 12.2022 నాడు.మహా రుద్రాభిషేఖం. 50 వది 2023 జనవరి 01 నాడు ప్రసిద్ధ పుణ్యక్షేత్రం శ్రీ రామప్ప దేవాలయము లో 🙏 ఈ May 1 వ తేదీ నుండి June 10 వరకు 41 రోజులు శ్రీ గాయత్రి మంత్రం దశ కోటి పారాయణ మహా యజ్ఞం.🙏 June 11,నాడు శ్రీ లక్ష్మీ గణపతి హోమము జూన్ 12 నాడు శ్రీ గాయత్రి హోమము,శ్రీ సాయి గాయత్రి హోమము,మహా పూర్ణాహుతి (శ్రీ గాయత్రి మంత్రం దశ కోటి పారాయణ మహా యజ్ఞం మహా పూర్ణాహుతి) ఈ విధంగా మహా రుద్రాభిషేఖంలు తో పాటు ఇతర తేదీలలో వేరే కార్యక్రమములు ప్రస్తుతానికి నిర్ణయం అనుకోవటం జరిగింది. ఇందులో ఏదేని మార్పులు ఉంటే,అప్పటి పరిస్థితులను బట్టి ,సంస్థ వివిధ విభాగముల కార్యక్రమము లను బట్టి మార్పులు ఉంటే తెలియచేయ . బడుతుంది 🙏 సాయిరాం🙏 సదా శ్రీ సాయి సేవలో అధ్యక్షులు శ్రీ సత్యసాయి సేవా సంస్థలు రంగారెడ్డి జిల్లా,తెలంగాణ