ఓం శ్రీ సాయిరాం 🌹 భగవాన్ శ్రీ సత్యసాయి బాబా వారి దివ్య అనుగ్రహం తో తేదీ: 20-03-2022 ఆదివారం రోజు శ్రీ సత్య సాయి సేవా సమితి తంగల్లపల్లి, రాజన్న సిరిసిల్ల జిల్లా భక్తులు, యువకులు, బాలవికాస్ విద్యార్థినీ విద్యార్థులు సుమారు 90 మంది బృందం ఆధ్యాత్మిక విహార యాత్రకై, దక్షిణ భారత దేశంలో గల రెండవ స్వయంభూ గా కాసీంపేట్, గన్నేరువరమ్ మండలం , కరీంనగర్ జిల్లాలో వెలసిన మనసాదేవి ఆలయం సందర్శన మరియు సమీపంలో నీ పారవెల్లి గ్రామంలో స్వయంభు వెలసిన శ్రీ లక్ష్మీ గణపతి ఆలయం సందర్శనకై ఉదయం 9 గంటలకు తంగల్లపల్లి మందిరం లో స్వామీ వారి ఆశీస్సులు తీసుకొని హారతి , విభూతి తీసుకొని బయలుదేరి మధ్యలో గండ్ల పోచమ్మ దర్శనం చేసుకొని 11.00 గంటల వరకు పారవెల్లి గ్రామంలో స్వయంభు వెలసిన శ్రీ లక్ష్మీ గణపతి ఆలయం సందర్శన లో భాగంగా అక్కడ గణపతి అధర్వణ శీర్షం అందరూ సామూహికంగా పారాయణం చేసి , దర్శనం, ప్రసాదం స్వీకరించి, తరువాత కాసీంపేట్, గన్నేరువరమ్ మండలం , కరీంనగర్ జిల్లాలో వెలసిన మనసాదేవి ఆలయం సందర్శన లో భాగంగా అక్కడ ప్రతిష్టించిన 108 నాగ లింగాలకు సామూహిక రుద్ర పారాయణ చేసి జలాభిషేకం నిర్వహించి ఆలయ దర్శనం చేసుకోవడం జరిగింది. తదుపరి 12.00 గం.లకు ఓంకారం , భజన తో ప్రారంభమై రెండు గంటల వరకు సత్సంగం నిర్వహించడం జరిగింది. ఇందులో సిద్దిపేట జిల్లా శ్రీ సత్య సాయి సంస్థల ఆధ్యాత్మిక incharge శ్రీమతి ఇందిరా గారు మహిళా విభాగం అవశ్యకత, చరిత్రలో గల వీర వనితల గొప్పదనాన్ని వివరించి మహిళలు సంస్థలోని అన్ని కార్యక్రమాల్లో ముందుండాలని తెలియజేశారు. తదుపరి సిద్దిపేట జిల్లా మహిళా incharge కుమారి యమునా రాణి గారు మాట్లాడుతూ బాలవికాస్ తరగతి నిర్వహణ ప్రాముఖ్యత, యువత సంస్థలో నిర్వహించ వలసిన పాత్ర, భక్తులుగా అందరూ స్వామి వారి సందేశాన్ని మన జీవితాలలో సూచించాలని, చక్కని భజన, భక్తి , క్రమ శిక్షణ తో , నిస్వార్థం తో కూడిన సేవ యొక్క ప్రాముఖ్యత వివరిస్తు అందరినీ ఉత్తేజపరిచినారు. తదుపరి 2.30 గం.లకు భోజన విరామం లో అక్కడే వండిన ఆహారాన్ని స్వామీ వారికి నైవేద్యం ఆరగించి, బ్రహ్మార్పణం చదివి అందరూ భోజనం స్వీకరించి తదుపరి వయసుల ప్రకారం జట్లు చేసుకొని మెదడుకు మేత కలిగించే ఆధ్యాత్మిక క్విజ్ నిర్వహణ , ఆధ్యాత్మిక ఆటలు ఆడుకొని సా. 5.30 గంటల కు స్వామీ వారికి హారతి ఇచ్చి తిరుగు ప్రయాణం చేసి అందరూ స్వామీ వారి దయ తో క్షేమంగా తంగల్లపల్లి మందిరం చేరి స్వామీ వారికి కృతజ్ఞతలు తెలిపి హారతి ఇచ్చి , విభూతి ప్రసాదం స్వీకరించి , మిగిలిన ప్రసాదం అందరూ తీసుకొని ఆనందంగా ఇల్లు చేరారు. ఈ కార్యక్రమం లో యువత ముఖ్యపాత్ర పోషించి ముందు ఉంది అన్ని ఏర్పాట్లు చూసుకొని కార్యక్రమాన్ని నడిపించారు. ఇంత ఆనంద కరమైన అవకాశాన్ని స్వామీ వారు ప్రసాదించి, అన్నీ తానై నడిపించి అందరికీ ఆనందాన్ని ప్రసాదించి క్షేమంగా స్వస్థానం చేర్చినందుకు స్వామీ వారి చరణాలకు శత కోటి వందనాలు తెలియజేస్తూ.. ప్రేమ పూర్వక కృతజ్ఞతలతో ..