మహా శివరాత్రి పర్వదిన సందర్భంలో, మన జిల్లా అధ్యక్షులు శ్రీ Ch మల్లా రెడ్డి గారు మన మందిరంలో జ్యోతీ ప్రజ్వలన, పాదుకాభిషేకం, లింగార్చన సేవలు నిర్వహించి, మధ్యాహ్నం కాళేశ్వర ముక్తేశ్వర స్వామి వారి సన్నిధిలో 86 మంది జిల్లా సాయి సేవాదళ్ వారితో కలసి సేవలు నిర్వహించడం జరిగింది. మన తిరుమలగిరి భజన మండలి వారు, ఉదయమే ఓంకారం, సుప్రభాతం, నగర సంకీర్తన సేవలు నిర్వహించారు. అలాగే, రేగొండ భజన మండలి వారు స్థానిక శివాలయం లో లింగాభి శేకములు, జాగరణ సేవలు నిర్వహించి భగవాన్ శ్రీ సత్యసాయి బాబా వారి అనుగ్రహ ఆశీస్సులతో విజయవంతం చేశారని సంతోషంతో తెలియజేస్తూ.... మీ, Ch మల్లా రెడ్డి జిల్లా అధ్యక్షులు శ్రీ సత్య సాయి సేవా సంస్థలు, భూపాలపల్లి