స్థానిక ఏటూరు నాగారం పరిసర ప్రాంతాల్లో వున్న *గంటల కుంట, గుండెంగి వాయి, చింతల మోరి మరియు ముడేలు తోగు గిరిజన ప్రాంతాల్లో తేది 20.11.2021న* శ్రీ సత్యసాయి సేవా సంస్థలు భూపాలపల్లి జయశంకర్ జిల్లా వారు ఆదివాసీ గిరిజన భక్తులకు సేవలను నెల నెలా అందిస్తూ వస్తున్నారు:- 1) ప్రాథమిక చికిత్స, మందులను ఇవ్వడం-63 మందికి. 2) బాల వికాస్ పిల్లలకు శ్లోకాలు చెప్పడం, చలి కాలం రక్షణ కోసం సాయి స్వెట్టర్ లు పంపిణీ-96 మందికి ఇవ్వడం. 3) మాతా శిశు సంక్షేమ సూచనలు, ఆరోగ్యం గురించి అవగాహన కల్పించి 4) ప్రతి కుటుంబానికి 2- భోజన ప్లేట్స్,2- గ్లాసులు, 1- ప్లాస్టిక్ మ్యాట్ లను, శ్రీ సత్యసాయి బాబా వారి 96వ జన్మ దినోత్సవ వేడుకల సందర్భంగా *156 కుటుంబాలకి పంపిణీ చేసినట్లు* శ్రీ సత్య సాయి సేవా సంస్థల జిల్లా అధ్యక్షులు శ్రీ Ch మల్లా రెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు. *ప్రతి నెల ఈ గిరిజన ప్రాంతాల్లో నివసించే వారికి వైద్య సేవలు, సాయి ప్రోటీన్ ఫుడ్ పంపిణీ చేస్తున్నట్లు తెలిపారు.* ఈ కార్యక్రమంలో Dr.V రవీందర్, V Umamaheshwar Rao, మధుకర్ తదితరులు పాల్గొన్నారు అని తెలియ జేశారు....