ఓం శ్రీ సాయిరాం పేద యువతి పెళ్ళికి ఆర్థిక చేయూత భగవాన్ శ్రీ సత్యసాయి బాబా వారి దివ్య అనుగ్రహ ఆశీస్సులతో భగవాన్ శ్రీ సత్యసాయి సేవా సమితి, జగిత్యాల ఆధ్వర్యంలో జిల్లాలోని మేడిపల్లి గ్రామం నకు చెందిన పాలెపు మాణిక్యం - లక్ష్మి గార్ల కుమార్తె పాలెపు సుకన్య వివాహం నకు చేయూతనందించడం జరిగింది. ఈ మధ్యనే సుకన్య వివాహం నిశ్చయమయ్యింది, కాని వారు ఒక పూరి గుడిసె లో నివసిస్తూ ఆర్థికంగా చాలా బీదరికంలో ఉండటం వలన మన సత్యసాయి భక్తులు మరియు ఆ గ్రామ ఉప సర్పంచ్ గారు మా సంస్థ దృష్టికి తీసుకురావడం జరిగింది. సంస్థ ద్వారా తక్షణమే స్పందించి భక్తులందరి సహకారంతో ఆ పేద యువతికి వివాహం నకు కావలసిన ముఖ్య వస్తువులైన బంగారు మంగళ సూత్రం , వెండి మట్టెలు , పెళ్లి చీర , మంగళ హారతి సెట్, కన్యాదాన తాంబూలం మరియు చెంబు, స్టీల్ బిందె , ప్లేట్లు , గ్లాసులు మరియు 25kg ల బియ్యం దాదాపు 11,000 రూపాయల విలువగల వస్తు సామాగ్రిని వారికి ఈ రోజు అందచేయడం జరిగింది. అమ్మాయి పెళ్లి చేసుకొని ఆ జంట సుఖంగా ఉండాలని , తల్లి గారికి మరియు మెట్టినింటికి మంచి పేరు తేవాలని స్వామివారిని ప్రార్థిస్తూ అలాగే సహకరించిన భక్తులందరికీ భగవానుని సంపూర్ణ ఆశీస్సులు నిండుగా ఉండాలని ఆ సాయినాథుణ్ణి ప్రార్థిస్తున్నాం. జై సాయిరాం భగవాన్ శ్రీ సత్యసాయి సేవా సమితి, జగిత్యాల