ఓం శ్రీ సాయిరాం, ఈరోజు భగవాన్ శ్రీ సత్య సాయి బాబా వారి దేవాలయం లో శిరిడి సాయి నాధుని మరియు శివలింగ ప్రతిష్ఠా మహోత్సవం నిర్వహించుకోవడం జరిగింది. ఈ కార్యక్రమంలో వేద బ్రాహ్మణోత్తములు మండలే ముల వేణుగోపాల్ శర్మ మరియు సుబ్రహ్మణ్యం ఆచార్యుల చేతుల మీదుగా అంగరంగ వైభవంగా ఉదయం కలశ పూజ గణపతి పూజ, గణపతి హోమం, నవగ్రహ హోమం, రుద్ర హోమం, మరియు సాయి గాయత్రి హోమముల అనంతరం పూర్ణాహుతి కార్యక్రమం తదనంతరం షిరిడి సాయి నాధుని విగ్రహ ప్రతిష్ట మహోత్సవ కార్యక్రమం నిర్వహించడం జరిగింది అనంతరం స్వామివారికి విశేష హారతులు సాయి అమృత ఆహార ప్రసాద వితరణ చేయడం జరిగింది ఈ కార్యక్రమంలో సాయి కుటుంబ సభ్యులు అందరూ ఆనందంగా సాయి సేవలో పాల్గొని తరించారు