ఈ నాటి 75వ స్వాతంత్ర దినోత్సవ వేడుకల సందర్భంగా, శ్రీ సత్యసాయి సేవా సంస్థలు భూపాలపల్లి జయశంకర్ జిల్లా వారి ఆధ్వర్యంలో ఉదయము 10.15 కి భూపాలపల్లి మన మందిరం నుండి దాదాపు 45 కిమీ దూరంలో వున్న *శ్రీ సత్యసాయి తండా* (ముసలమ్మ పేట) లో వివిధ సేవా కార్యక్రమాలు జరిగినవి. బాల వికాస్ పిల్లలకు జుబ్బాలు, బొట్టు బిళ్ళలు, నైల్ పెయింట్స్, అందించి వారి చేత జాతీయ జెండా పండుగ ఆనందంగా నిర్వహించడం జరిగింది. అలాగే శ్రీ సత్యసాయి యూత్ వారిచే ఆదివాసీ లకు షాంపూ, సబ్బులు, పంపిణీ చేయటం అందరూ కలసి స్వాతంత్ర దినోత్సవ వేడుకలను విజయవంతం గా స్వామి వారి కృపతో చేయడం జరిగింది. ఈ ఆదివాసీ సేవలో జిల్లా ఐటీ కోఆర్డినేటర్, జిల్లా విద్యా విభాగ్ కోఆర్డినేటర్, శ్రీ సత్యసాయి యూత్ లెజెండ్ మరియు 9 మంది సాయి యూత్ పాల్గొన్న వారికి స్వామి వారి ఆశీస్సులు దండిగా వుండాలని మనసారా కోరుకుంటూ.... మీ Ch మల్లా రెడ్డి జిల్లా అధ్యక్షులు శ్రీ సత్యసాయి సేవా సంస్థలు భూపాలపల్లి జయశంకర్ జిల్లా