ఓం శ్రీ సాయిరాం భగవాన్ శ్రీ సత్య సాయి బాబా వారి దివ్య అనుగ్రహ ఆశీస్సులతో ఈ రోజు ఉదయం 6 గంటల 15 నిమిషాల నుండి 7 గంటల వరకు సుప్రభాతం,స్వామి వారి అష్టోత్తర శతనామావళి,భజన మరియు హారతి కార్యక్రమం నిర్వహించబడినది. ఈ కార్యక్రమంలో ఇద్దరు పురుషులు పాల్గొన్నారు. ఆ తదుపరి 8 గంటల నుండి 8 గంటల 30 నిమిషాల వరకూ రుద్ర పారాయణం చదవడం జరిగింది. ఇట్టి కార్యక్రమంలో ముగ్గురు పురుషులు పాల్గొన్నారు. సాయంత్రం 6 గంటల 30 నిమిషాల నుండి 7 గంటల 30 నిమిషాల వరకూ భజన కార్యక్రమం నిర్వహించబడినది. ఇట్టి భజనలో 20 మంది పురుషులు పాల్గొన్నారు మరియు 13 మంది స్త్రీలు పాల్గొన్నారు. జై సాయిరాం