*ఓం శ్రీ సాయిరాం* భగవాన్ శ్రీ సత్య సాయి బాబా వారి దివ్య ఆశీస్సులచే ఈ రోజు శ్రీ సత్య సాయి సేవా సంస్థలు రాజన్న సిరిసిల్ల జిల్లాకి, అఖిల భారత శ్రీ సత్య సాయి సేవా సంస్థల ద్వారా కోవిడ్ వ్యాధిగ్రస్తుల ఆక్సిజన్ కొరత తీర్చడం ద్వారా వారికి ప్రాణ రక్షణ చేయుటకు ఉపయోగపడే "ఆక్సిజన్ కాంసెంట్రెటర్" ని అందజేయబడినది. దీనిని మన సత్యసాయి సేవా సమితి సిరిసిల్ల మందిరం లో జిల్లా మెడికల్ ఇంచార్జెస్ శ్రీ మంచకట్ల సుదర్శన్ మరియు చుంచు లక్ష్మణ్ గార్ల ఆధ్వర్యం లో, జిల్లా అధ్యక్షులు శ్రీ బూర రవీందర్ గారు మరియు డా.౹౹ కోడం విక్రమ్ MD గారి చేతుల మీదుగా ఇట్టి పరికరాన్ని ఆవిష్కరించడం జరిగింది. దీనిని రోగుల అవసరార్థమై, ఉచితముగా ఉపయోగించుకొని , తిరిగి ఇచ్చివేయు పద్ధతిలో నిర్వహించబడుతుంది. ఈరోజు *డాక్టర్స్ డే సందర్బంగా డా. ౹౹ పూర్ణచందర్ సర్ గారి జ్ఞాపకార్థం,*భగవాన్ శ్రీ సత్యసాయి నిత్యాన్నదానము* (పేషెంట్స్ సహాయకులకు ప్రతిరోజు *భోజన సేవ*), ప్రభుత్వ ఏరియా ఆసుపత్రి, సిరిసిల్లా యందు , *శ్రీ సత్యసాయి సేవా సంస్థలు, రాజన్న సిరిసిల్ల జిల్లా* ఆధ్వర్యంలో *నేటి అన్న దాన సహాయకులు* *శ్రీమతి & శ్రీ కోటగిరి సుధాపూర్ణచందర్గా గారు. ఈరోజు సాయంత్రం 6 గంటల 30 నిమిషాల నుండి 7 గంటల 30 నిమిషాల వరకూ భజన కార్యక్రమం నిర్వహించబడినది. ఇట్టి కార్యక్రమంలో ఆరుగురు పాల్గొన్నారు. *సమస్త లోకాః సుఖినోభవంతు జై సాయిరాం