*సత్యం ధర్మం శాంతి ప్రేమ లాంటి స్వామి వారి మాటలను ఒక చోటికి చేర్చి అందమైన సేవ అనే మాలగా పేర్చి భగవానునికి అర్పిస్తున్న శ్రీ సత్యసాయి సేవా సంస్థలు భూపాల పల్లి, జయ శంకర్ జిల్లా యువజన విభాగం* వారిచే ఆదివారం రోజున భూపాలపల్లి నుండి 84కి.మి దూరంలో, కనీసం వాహన సదుపాయం లేని గిరిజన తండాకి మన యువ విభాగం సంతోషంగా సంబరంగా కొండలు,కొలనులమధ్యలో నుండి నామసంకిర్తన చేస్తూ అక్కడికి చేరుకోవడంతో మొదటిగట్టం పూర్తి... కరోనాతో బాధపడుతున్న వారిని గూడెం నుండి దూరంగా ఉంచటంతో పాటుగా వారు కరోనా నుండి కోలుకున్న తర్వాత కూడా కనీస వసతులు,సదుపాయాలు లేకుండా వారిని అలానే ఉంచటం బాధాకరంగా ఉన్న సందర్భంలో గ్రామస్తులకు మన స్వామి మరియు శ్రీ సత్యసాయి సంస్థల వైభవం,కరోనా గురించిన అవగాహన,స్వామి వారి ఫొటో మరియు విభూతి ప్రసాదంతో పాటుగా 15రోజులకు సరిపడ వంట సామనుతో పాటుగా బియ్యం,పిల్లలకి బట్టలు, ప్రతి గడప గడప కి హైపో క్లోరైడ్ ద్రావణం పిచికారి,మధ్యాహ్న భోజనం ఏర్పాటు చేసి వారికి భోజనం అందించి రావటం జరిగింది... *గత 15రోజులుగా కనీసం ఒక్క పూట కూడా తినడానికి తిండి లేకుండా ఉన్న వారికి ఆ భగవానుడు పంపిన మధ్యాహ్న భోజనం చూడగానే కన్నీటి పర్యంతం అయ్యి తమ మనసులోనీ బాధని ఏడవటం ద్వారా తీర్చుకోవటం మనం చూడవచ్చు... అలాగే వర్షంలో కూడా వారు స్వామి వారి చిత్రపటం పట్టుకొని మనకి వారి చిరునవ్వుల పువ్వులను అందించటం మనసుకై ఎంతో ఆనందం కలిగించిన సన్నివేశం... అక్కడ ఉన్న ప్రతి ఒక్కరి మొఖంలో కూడా ఎంతో సాయం చేసిన ఆ భగవానుడికి ధన్యవాదములు అని చెప్పకనే వారంతా సంతోషంగా నవ్వులతో తెలియచేశారనటం అతిశయోక్తి కాదు... *గిరిజన తండాలో చిరునవ్వులు చిందించే ఎంతో గొప్ప ఈ సేవా కార్యక్రమంలో భాగ్యం కల్పించిన భగవానుడికి సదా కృతజ్ఞులం. *జై శ్రీ సత్యసాయిరామ్* శ్రీ సత్యసాయి సేవా సంస్థలు భూపాలపల్లి జయశంకర్జిల్లా