ఓం శ్రీ సాయిరాం, కోవిడ్ బాధిత పేద కుటుంబాలకు మరియు లాక్ డౌన్ లేదా కరోనా విపత్తు వల్ల ఆదాయం కోల్పోయి ఎటువంటి ఆధారం లేని వారికి భగవానుని దివ్యాశీస్సులతో శ్రీ సత్యసాయి సేవా సమితి , జగిత్యాల ద్వారా పన్నెండు రకాల నిత్యావసర వంట సరుకులతో(సన్న బియ్యం, పప్పు , నూనె , ఉప్పు , చక్కర , అటుకులు , గోధుమ పిండి , రవ్వ , చింతపండు , ఆవాలు , కారం పొడి, పసుపు) కూడిన అమృత కలశములను వారి ఇంటి వద్దకు వెళ్లి అందించడం జరిగింది. సాయినాథుని దివ్య అనుగ్రహ ఆశీస్సులు అందరిపై నిండుగా ఉండాలని మనసారా ప్రార్థిస్తున్నాం. జై సాయిరాం. భగవాన్ శ్రీ సత్యసాయి సేవా సంస్థలు, జగిత్యాల జిల్లా