*కాలిన గాయాలతో బాధ పడుతున్న ఆదివాసీ గిరిజన బాలికకు శ్రీ సత్యసాయి సంస్థ వారి చేయూత....* శ్రీ సత్య సాయి సేవా సంస్థలు భూపాలపల్లి వారి సహాయ సహకారంతో దూదేకుల పల్లి గ్రామానికి ఐదు కి. మీ.ల దూరంలో ఉన్న ఆదివాసీ గిరిజన ప్రాంతంలో గత రెండు రోజులుగా కలిన గాయాలతో బాధ పడుతున్న *దుర్గ* అనే బాలిక ను సత్యసాయి యూత్ వారు సందర్శించి, హృదయ విదారక స్థితి లో ఉన్న బాలికకు ప్రథమ చికిత్స చేసి, సంస్థ పెద్దల సహకారంతో , స్థానిక ప్రముఖ దవాఖానలో బాలికకు చక్కని వైద్యం, చికిత్స కోసం ఏర్పాటు చేసినారనీ ఒక పత్రికా ప్రకటన లో శ్రీ ch మల్లా రెడ్డి, జిల్లా అధ్యక్షులు, వివరాలు తెలియజేశారు. శ్రీ సత్య సాయి సేవా సంస్థలు భూపాలపల్లి జయశంకర్ జిల్లా