ఓం శ్రీ సాయిరాం *శ్రీ సత్యసాయి సేవా సంస్థలు* *భూపాలపల్లి జిల్లా* *యువ విభాగం వారు* *స్వామి వారి ఆపార అనుగ్రహ ఆశీస్సులతో పాటుగా* శ్రీ సత్యసాయి సేవా సంస్థలు తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు శ్రీ పి.వెంకట్రావు గారు మరియు శ్రీ సత్యసాయి సేవా సంస్థలు భూపాలపల్లి జిల్లా అధ్యక్షులు శ్రీ మల్లారెడ్డి గార్ల సహాయ సహకారాలతో తేదీ 24/02/2021 రోజున భూపాలపల్లి నుండి సుమారు *45కి.మి ప్రయాణం* చేసిన తర్వాత ఆడవి ప్రాంతం గుండా 10కి.మి. లోపల కనీస వసతులు లేని *దుదేకపల్లి* లోని నిరాశ్రయులు, నిరక్షరాస్యులు మరియు కనీసం కూడు గుడ్డ కూడా అందుబాటులో లేని ఆ గిరిజన ప్రజలకు స్వామి వారు తోడు నీడై నిలిచారు. చాలా మంది పిల్లలకు పెద్దలకు కనీస దుస్తులు లేని వారికి నిన్నటి రోజున దుస్తుల పంపిణీ మరియు మెడికల్ క్యాంపు నిర్వహించి ప్రతి ఒక్కరికీ ప్రథమ చికిత్స మరియు మందులు పంపిణీ చేయటం జరిగింది.ఆలాగే అవసరం ఉన్న *ఒక అమ్మాయి కొద్ది రోజుల క్రితం అగ్ని ప్రమాదంలో తన కాళ్ళకు జరిగిన గాయం పూర్తిగా తన కాళ్లను శక్తి హీనం చేసి పూర్తిగా నాశనం చేసిన కూడా తగిన వైద్యం తీసుకోలేని పరిస్తితిలో రోజు వారు మట్టి తో ఆ గాయాన్ని రాయటం వల్ల ఏర్పడి ఉన్న తనకి ఆసుపత్రి వైద్యంలో కూడా సహాయం చేయటానికి శ్రీ సత్యసాయి సేవా సంస్థలు తోడు నిలవటం* అందులో భూపాలపల్లి యువ విభాగం స్వామి వారి పనిముట్లు గా పాటుపడటం చాలా సంతోషకరం... *యువ విభాగం* *శ్రీ సత్యసాయి సేవా సంస్థలు* *జయశంకర్ భూపాలపల్లి జిల్లా*