ఓం శ్రీ సాయిరాం, భగవాన్ శ్రీ సత్య సాయి బాబా వారి దివ్య అనుగ్రహ ఆశీస్సులతో, శ్రీ సత్యసాయి సేవా సంస్థలు పెద్దపల్లి జిల్లా తేదీ 14/02/2021 ఆదివారం రోజున సేవాదళ్ ట్రైనింగ్ ప్రోగ్రాం, శ్రీ సత్యసాయి యువ సమ్మేళనం జరుపుకున్నాము. ఊదయం 9.00 గంటలకి సేవ దళ్ సభ్యుల రిజిస్ట్రేషన్, 10.30am రాష్ట్ర అధ్యక్షులు గారిచే పతాకావిష్కరణ. 10.40 am వేదం భజన జ్యోతి ప్రజ్వలన, 11.00am ముందుగా స్వామివారికి రాష్ట్ర అధ్యక్షుల వారికి రాష్ట్ర కోఆర్డినేటర్స్ కి స్వాగతం పలుకుతూ సభ ప్రారంభం.11.10 am సభ ప్రారంభోపన్యాసం SSSSO రాష్ట్ర అధ్యక్షులచే జరిగినది.11.50 am రాష్ట్ర యువత సమన్వయకర్త గారు ఇంపార్టెన్స్ ఆఫ్ యూత్ ఇన్ ప్రశాంతి సేవల గురించి ప్రసంగించరు. 12.15 pm ప్రశాంతి సేవల స్టేట్ కోఆర్డినేటర్ గారు ప్రశాంతి సేవలగురించితెలియజేశారు. 12.45 pm రాష్ట్ర మహిళా స్పిరిచువల్ కోఆర్డినేటర్ గారు వ్యక్తిగత ఆధ్యాత్మిక సాధన సేవ గురించి తెలియజేశారు. 1.30 pm స్టేట్ కోఆర్డినేటర్ (మహిళా విభాగం ) గారు ప్రశాంతి నిలయం సేవల ప్రాముఖ్యతగురించి తెలియజేశారు 2.15 pm బాలవికాస్ పూర్వ విద్యార్థి సత్సంగం లోని సాధన అనే అంశం గురించి తెలియజేశారు. 2.45 pm భోజన విరామం. 3:15 pm ప్రశాంతి నిలయం లో సేవల ద్వారా వ్యక్తిగత మార్పులు సేవల ద్వారా కలిగే అనుభూతి గురించి తెలియజేశారు. 4:15 pm జిల్లా సేవాదళ్ కోఆర్డినేటర్ Vote of thanks మరియు 4.30 మంగళ హారతి తో ముగించుకోవడం జరిగినది. సమావేశ స్థలం శ్రీ సత్యసాయి సేవామందిరంగోదావరిఖని సమితి లో జరిగింది. ఈ సమావేశానికి జిల్లా ఆఫీస్ బెరర్లు, సమితి కన్వీనర్లు మరియు ఆఫీస్ బెరర్లు, భజన మండలి కన్వీనర్లు ఆఫీస్ బేరర్లు ,సేవాదళ్ సభ్యులు సాయి కుటుంబ సభ్యులు 61. మంది మహిళలు. 64. పురుషులు మొత్తం 125 మంది అందరూ స్కార్ఫ్ తో పాల్గొన్నారు. వీరందరికీ స్వామి వారి అనుగ్రహా ఆశీస్సులు ఉండాలని వేడుకుంటూ.. సదా సాయి సేవలో, జిల్లా అధ్యక్షులు, శ్రీ సత్య సాయి సేవా సంస్థలు, పెద్దపల్లి జిల్లా.