ఓం శ్రీ సాయిరాం, భగవాన్ శ్రీ సత్యసాయి బాబా వారి దివ్యాశిశులతో ఈ రోజు శ్రీ సత్యసాయి సేవా సంస్థలు, పెద్దపల్లి జిల్లాలో బాలవికాస్ విభాగం వారు చేపట్టిన దివ్యమైన తండులార్చన కార్యక్రమంలో పెద్దపల్లి, గోదావరిఖని , 8 ఇంక్లైన్ కాలనీ సమితులలో బాలవికాస్ విద్యార్థులు, ఆన్లైన్ బాలవికాస్ విద్యార్థులు వారి తల్లిదండ్రులు, బాలవికాస్ గురువులు, జిల్లా పదాధికారులు, సమితి కన్వీనర్లు గార్లు, సమితి పదాధికార్లు , సాయి కుటుంబ సభ్యులందరు ప్రత్యక్షంగా, పరోక్షంగా పాల్గొని సహాయ సహాకారాలు అందించి విజయవంతం చేసినందుకు స్వామి వారు అందరి ఇంట వెంట కంట జంట ఉండి ఆయురారోగ్యాలు , ఆనందైశ్వర్యాలు , చిన్నారులకు విద్యాబుద్ధులు ఇచ్చి మెచ్చి దీవించాలని , తోడుగా నీడగా ఉంటూ మరిన్ని కార్యక్రమాలు మనందరము కలసి మెలసి చేసే భాగ్యాన్ని ప్రసాదించాలని మనసారా కోరుకుంటూ పాల్గొన్న వారు బాలురు 42, బాలికలు 38, గురువులు 9, తల్లిదండ్రులు మరియు సాయి కుటుంబ సభ్యులు 35 మొత్తం 124 మంది పాల్గొన్నారు. జై సాయిరాం. సదా సాయి సేవ లో జిల్లా విద్యా విభాగం , బాలవికాస్ టీమ్, శ్రీ సత్యసాయి సేవా సంస్థలు, పెద్దపల్లి జిల్లా.