సాయిరాం! ది.23-11-2018,శుక్రవారం, ఉ.5.20 గం.ల సుముహుర్తానికి, స్వామి 93వ జయంతి నాడు, కలశస్థాపనతో నూతనంగా, సర్వాంగసుందరంగా నిర్మించిన భజనమందిరం,స్వామివార్ల చిత్రపటాల స్థాపన నగరసంకీర్తనతో, భక్తులకే మీ స్వామి ఆశీస్సులతో ప్రారంభమైంది! ఉ.7గం.నుండి ప్రత్యేక పూజలు, అలంకరణ, భక్తులకు దర్శనం, మ.12.30 గం.లకు 2500 భక్తులకు-"మహానారాయణ సేవ" జరిగింది. సా.6 గం.లకు ప్రత్యేక భజన,బాలవికాస్ కల్చరల్ ప్రోగ్రామ్స్,బహుమతి ప్రదానం జరిగాయి. స్వామివారికి మహాహారతితో జయంతి కార్యక్రమాలను ముగించారు! సాయిరాం!!