ఓం శ్రీ సాయిరాం భగవాన్ శ్రీ సత్యసాయి బాబా వారి దివ్య అనుగ్రహ ఆశీస్సులతో తేది 19-01-2021రోజున మహిళా దినోత్సవమును పురస్కరించుకొని చేసిన కార్యక్రమముల వివరములు. 1)స్థానిక చారుమతి ఛైల్డ్ కేర్ సెంటర్లో ఉంటున్న ముగ్గురు పిల్లలుకు (ఇద్దరు అమ్మాయిలు, అబ్బాయి)ఒక్కొక్కరికి 5000/- రూపాయల చొప్పున పోస్ట్ ఆఫీస్ లో ఫిక్స్డ్ డిపాసిట్ చేసి వాటి పాసుబుక్ జిరాక్స్ పత్రాలను చారుమతి యాజమాన్యానికి ఇవ్వడం జరిగినది. 2).జనవరి 1 కొత్త సంవత్సరమును పురస్కరించుకొని పిల్లలకు క్విజ్ పోటీలు మరియు స్వామి వారి గ్రీటింగ్స్ తయారీ పోటీలు నిర్వహించడం జరిగినది. దింట్లో గెలుపొందిన విద్యార్థులకు ఈ రోజు బహుమతులు అందజేయడం జరిగినది. 3).పిల్లలకు ముగ్గుల పోటీలు నిర్వహించి బహుమతులు ఇవ్వడంజరిగినది. 4).పిల్లలకు జామెంట్రీ బాక్సులు, దువ్వెనలు, బిస్కెట్ ప్యాకెట్లు, పండ్లు పంపిణి చేయడం జరిగినది. ఈ కార్యక్రమములో 12 మంది సేవాదళ్ సభ్యులు పాల్గొనడం జరిగినది. సాయి సేవలో మహిళా సమన్వయ కర్త నల్గొండ.