ఓం శ్రీ సాయిరాం, భగవాన్ శ్రీ సత్యసాయి బాబా వారి దివ్య అనుగ్రహ ఆశీస్సులతో తేది 20-12-2020 రోజున మిర్యాలగూడ హౌసింగ్ బోర్డు కాలనీలో గల శ్రీ సత్యసాయి బాబా వారి మందిరములో ఎవిస్ హాస్పిటల్ వారి ఆధ్వర్యంలో వేరికోస్(కాళ్లలో సిరలవాపు) వ్యాధికి సంబందించిన మెడికల్ క్యాంపు నిర్వహించడం జరిగినది. ఈ మెడికల్ క్యాంపు నందు మొత్తం 200 మందికి వైద్యం అందిచి మందులు పంపిణి చేయడం జరిగినది. ఈ కార్యక్రమములో 5 డాక్టర్ల బృందం మరియు సేవాదళ్ సభ్యులు మహిళలు 9 మంది, పురుషులు 11 మంది పాల్గొనడం జరిగినది. సాయి సేవలో కన్వీనర్ శ్రీ సత్యసాయి సేవాసమితి మిర్యాలగూడ.