ఓం శ్రీ సాయిరాం, భగవానుని అపార కృపతో డిసెంబర్ నెల మహిళా దినోత్సవ సందర్భంగా, సిద్దిపేట జిల్లా లో జరిగిన సేవా కార్యక్రమాలు. నాలుగు భజన మండళ్ళలో మహిళా జాగృతి నిర్వహించాం. ఈ సందర్భంగా, తంధులార్చన, సత్సంగం,మహిళలకు పోటీలు (భజనలు, నీతి కథలు, క్విజ్ ( తపో వనం, ఇతి హాసములు), ఆధ్యాత్మిక ఆటలు.విజేతలకు చక్కటి బహుమతులు ప్రదానం చేయడం) నిర్వహించడం జరిగినది. సేవా కార్యక్రమాలు: హుస్నాబాద్ సమితి వారు రెండు కుటుంబాలకు కిరాణా సరుకులు అందజేశారు, బూరుగు పల్లి సమితి వారు ఆరేపల్లి గ్రామంలో 3 అమృత కలశం లు ఒక పేషంట్ కి నెల కి కావలసిన మెడిసిన్ అందజేశారు, గజ్వేల్ సమితి వారు అణాజీపూర్లో 9 మందికి బ్లాంకెట్ పంపిణీ చేశారు, సిద్దిపేట సమితి వారు ఉదయం రుద్ర అభిషేకం, ప్రశాంత్ నగర్ మరియు గీరాయి పల్లి గ్రామాల లో 2 అమృత కలశం లు, కిరాణా సరుకులు, ముగ్గురికి బట్టలు, 10 బ్లాంకెట్ లు, ఒక పేషంట్ కి నెల కి కావలసిన మెడిసిన్, 30 కుటుంబాలకు స్వామి తెలుగు కాలండర్లు, విభూతి పాకెట్స్ పంపిణీ చేయడం జరిగింది. నాలుగు గ్రామాలలో జరిగిన తందుల అర్చన లో 95 మందికి పైగా, మూడు సమితి లలో జరిగిన కుంకుమ అర్చన లో 17 మంది పాల్గొన్నారు. కృతజ్ఞత లతో, BSSSSO సిద్దిపేట. జై సాయిరాం