భగవాను శ్రీ సత్య సాయి బాబా వారి పుట్టిన రోజు వేడుకలను పురస్కరించుకొని శ్రీ సత్య సాయి సేవా సంస్థలు, భూపాలపల్లి జయశంకర్ జిల్లా ఆధ్వర్యంలో తేది.23.11.2020 కార్తీక సోమవారం నాడు వివిధ సేవా కార్యక్రమాలను జిల్లా అంతటా చేయుటకు సంకల్పం చేసుకొని ఏర్పాట్లు చేయడం జరిగింది. భూపాలపల్లి లో 108 మందికి అన్న ప్రసాద పాకెట్స్ మరియు 95 మందికి రగ్గులను పంపిణీ చేసి నట్లు సంస్థ జిల్లా అధ్యక్షులు శ్రీ Ch మల్లా రెడ్డి గారు తెలిపారు. కరోనా జాగ్రత్తలు పాటిస్తూ ఇలాంటి సేవా కార్యక్రమాలు చేస్తున్నందుకు యెంతో అభినందనియమని ముఖ్య అతిథిగా హాజరైన శ్రీ G రఘు పతి గారు, S O to GM, Singareni Bhupalapalli area వారు తెలియ జేశారు. *ఇట్టి కార్యక్రమంలో* *..సాయంత్రం 06.00 గంటలకు స్థానిక మహిళ లచే 95 జ్యోతుల దీపోత్సవం* *..తదుపరి, ప్రత్యేక భజన, కేక్ కట్, ఉయాల సేవా, 95 వ పుట్టిన రోజు పాటలు, డీపీ గారి ప్రత్యేక సందేశం, హరతి, విభూతి ప్రసాదంతో మన స్వామి వారి 95వ పుట్టిన రోజు వేడుకలు ముగియును కావున జిల్లా లోని రెండు సమితులు, 16 భజన మండలి సభ్యులు, కన్వీనర్లు, సమన్వయ కర్తలు, శ్రీ సత్య సాయి యూత్ టీమ్, భక్తులు అందరూ ఉల్లాసంగా ఉత్సాహంగా పాల్గొని, భగవాన్ శ్రీ సత్యసాయి బాబా వారి కృపకు పాత్రులు అయ్యారని తెలిపారు.* *శ్రీ సత్యసాయి సేవా సంస్థలు, భూపాలపల్లి జయశంకర్ జిల్లా- తెలంగాణ*