ఓం శ్రీ సాయిరాంస్వామివారి 95వ జయంతి వేడుకలలో భాగంగా , భగవానుని దివ్య అనుగ్రహ ఆశీస్సులతో, శ్రీ సత్యసాయి సేవా సంస్థలు , జగిత్యాల జిల్లా యువజన విభాగం ఆధ్వర్యంలో ఈ రోజు తేదీ 22-11-2020 ఆదివారం నాడు ఎర్దండి గ్రామం, ఇబ్రహీంపట్నం మండలం లో గ్రామసేవ కార్యక్రమం నిర్వహించుకున్నాము. గ్రామంలో మొక్కలను నాటడం జరిగింది బీద నారాయణులకు బ్లాంకెట్స్ అందచేయడం జరిగింది స్వామి వారి పుట్టు పండుగ విశిష్టత మరియు మహిమలు తెలిపి హారతి తో ముగించడం జరిగింది ఇట్టి గ్రామసేవలో జిల్లా అధ్యక్షులు , జిల్లా యువజన బాధ్యులు , జిల్లా సహా యువజన భాద్యులు , జిల్లా సాయి యువత మరియు గ్రామ యువత అందరూ ఉత్సాహంగా పాల్గొన్నారు. అందరిపై భగవానుని ఆశీస్సులు నిండుగా ఉండాలని మనసారా ప్రార్థిస్తున్నాం. జై సాయిరాం ప్రేమతో శ్రీ సత్యసాయి సేవా సంస్థలు- జగిత్యాల జిల్లా యువజన విభాగం