సాయిరాం సోదరులారా! సాయిరాం సోదరీమణులకు..... *_🙏"విశ్వేశ్వరుని జన్మదినం విశ్వానికే వేడుక"..🙏_* భగవానుని అపార అనుగ్రహంతో స్వామివారి అవతరణ వేడుకలను (జన్మదిన) పురస్కరించుకొని శ్రీ సత్యసాయి సేవా సంస్థలు, భూపాలపల్లి జయశంకర్ జిల్లా ఆధ్వర్యంలో యువజన విభాగం వారు జిల్లా అంతటా సేవలు చేయుటకు సంకల్పం చేసుకొని *తేది 08-11-2020న, గ్రామ సేవా కార్యక్రమాన్ని చికెన్ పల్లి భజన మండలి లో మరియు ఆము దాల పల్లి (కొత్త) & (పాత) గ్రామాలలో ప్రారంభించడం జరిగింది.* ఇట్టి కార్యక్రమం లో *1. ముందుగా చికెన్ పల్లి భజన మండలిలో దాదాపు 95 మందికి వైద్య పరీక్షలు నిర్వహించి టానికులు, మందులు ఇవ్వడం, ఎంపిక చేసిన 14 మందికి రగ్గులు, ట వాళ్ళు, గోధుమ పిండి పాకెట్స్-95 స్వామి కానుక గా ఇవ్వడం జరిగింది. మన జిల్లా సమన్వయ కర్తలు Dr శ్రీ V రవీందర్ గారు & శ్రీ V Umamaheswara Rao గారు హాజరై సేవలను విజయవంతం చేయడం. జిల్లా అధ్యక్షులను సంప్రదించి వారి సూచనలతో గ్రామాన్ని సందర్శించడం గ్రామ పెద్దలతో మాట్లాడడం, సేవలను స్వామి పుట్టిన రోజు సందర్భంగా కానుక లు అందజేయడం జరిగింది.* *2. కమలపుర్ గ్రామానికి చెందిన యూత్ శ్రీ సాంబమూర్తి చాలా శ్రమ తీసుకొని ఆమ్ దాలపల్లి గ్రామంలో 18 మంది ఎంపిక చేసిన కుటుంబీకులకు స్వామి కానుక గా రగ్గులు, టవల్లు, గోధుమ పిండి అందించినట్లు, అలాగే ఆ ముదాల పల్లి( కొత్త) గ్రామంలో కూడా 19 మంది కుటుంబీకులకు స్వామి కానుకలు గా రగ్గులు,తవల్లు, గోధుమ పిండిని ఇవ్వడం జరిగింది. కరోనా విస్తరిస్తున్నందున తీసుకోవలసిన జాగ్రత్తల గురించి (మాస్క్ మరియు సానిటైజర్ వాడకం పై) గ్రామస్తులకు అవగాహన కల్పించుటము జరిగింది. ఈ కొత్త గ్రామాల్లో యూత్ శ్రీ సారయ్య, కుమార్, క్రాంతి మొదలగువారు స్వామి సేవలను భవిష్యత్తులో చేయుటకు ముందుకు రావడం నిజంగా స్వామివారు మనతో వెంట జంట వుండి ఇలాంటి సేవలను విజయవంతం చేయడం మన అదృష్టం.* ప్రేమతో సదా సాయి సేవలో మీ... సందీప్ సింగ్ యువజన విభాగం *శ్రీ సత్యసాయి సేవా సంస్థలు, భూపాలపల్లి జయశంకర్ జిల్లా-తెలంగాణ*