భగవాన్ శ్రీ సత్యసాయిబాబావారి 93వ జన్మదినవేడుకలలో బాగముగా నవంబర్ 1, 2018 నుండి “శ్రీ సత్యసాయి నామజప మహాయజ్ఞము” పెద్దపల్లి జిల్లాలో ప్రారంబించుకున్నాము. నవంబర్ 1,2018 నుండి 21 వరకు 21రోజులు జిల్లాలోని అన్ని సమితిలలో 30ని,,లు స్వామివారి “ఓం శ్రీ సాయిరాం” నామజపము జరపాలని స్వామివారి అనుగ్రహముతో ఇంటింటికి స్వామివారి నామమును తీసుకుపోవాలన్న సంకల్పముతో జిల్లా అద్యక్కులవారి ఆదేశానుసారము జరుపుకోవటము జరిగినది. చివరిరోజు అనగా నవంబర్ 21 న ఆద్యాత్మిక కార్యక్రమాలతో (సాయిగాయత్రీ హోమములు లేక సత్యసాయి వ్రతములతో లేక పల్లకి సేవలతో) సాయంత్రము మహిళలతో 93 జ్యోతులతో స్వామివారికి మహా మంగళ హారతితో కార్యక్రమము ముగించటం అందులోభాగముగా గోదావరిఖని సమితి నందు మ.3.30 – 6.45 వరకు పల్లకి సేవా మహానగర సంకీర్తన నిర్వహించి, 7.00 - 7.45 భజన, మహిళలచే 93 జ్యోతులతో మహామంగళ హారతితో ముగిసినది .