ఓం శ్రీ సత్యసాయిరాం మన బంగారు స్వామి వారి దివ్య అనుగ్రహ ఆశీస్సులతో..... శ్రీ సత్య సాయి యూత్ టీమ్ వారి నిర్వహణలో....మన సందీప్ సింగ్, RYC మరియు శ్రీ Dr.V Ravinder, medical ఇంచార్జి గారి అధ్వర్యంలో సరిగ్గా నెల తర్వాత స్వామి వారే, ఆ ఆదివాసి గ్రామానికి వెళ్లండి వెళ్ళి రండి అంటూ సూచిస్తున్నట్లు గా తేది.20.08.2020 గురువారం నాడు.... ""సారక్క పల్లె"" గిరిజన ఆదివాసీ గూడెంలో అత్యవసర మెగా సేవలు అందించి రావడం జరిగింది. 1) 32 గుడిసెలను సాయి రక్ష గా తాటిపత్రి సీట్లను పరచి రావడం జరిగింది. 2) బాల బాలికలకు 60- స్నాక్స్ ప్యాకెట్లను అందివ్వడం.. 3) ప్రతీ ఇంటికి ఒక్కొక్కటి చొప్పున 50- అటుకుల పాకెట్ల పంపిణీ.. 4) బాల బాలికలకు, పురుషులకు మరియు స్త్రీలకు ప్రాథమిక ఆరోగ్య పరీక్షలు, అవగాహన కల్పించడం మరియు సంబంధిత మందుల పంపిణీ, వాడకం వివరాలు తెలియ జేయడం.. 5) 56మందికి గొడుగులను పంపిణీ చేయడం జరిగింది. చివరిగా, మన స్వామికి హరతి విభూతి ప్రసాద వితరణ కేవలము తొమ్మిది మంది సేవాదళ్ సమిష్టి సేవలో స్వామి నచ్చినట్లు సేవలు దిగ్విజయం చేసి తిరిగి రావడం జరిగింది. వర్షానికి గుడిసెలు తడుస్తూ ఉంటే స్వామివారి రక్షా కవచము పరచి రావడం తో ఆదివాసీల సంతోషం వ్యక్తం చేసిన తీరు కన్నీటి ధారలు, ఆనంద భాష్పాల తో మనల్ని పలుకరించి నట్లు గా ఉంది. తిరుగు ప్రయాణం లో వాహనాలు దిగబడడం తో ఆదివాసీలు కలసి.... భళే భళే సాయిరాం బంగారు సాయిరాం అంటూ నినాదాలు చేస్తూ వాహనాల్ని రోడ్డు వరకు చేర్చిన సేవను ఏమని చెప్పాలి. భూపాలపల్లి జిల్లాలోని ఆదివాసీల గ్రామ సేవలను స్వామివారే దగ్గరుండి చేయిస్తున్నారని తెలియ జేస్తూ...... మీ V Umamaheswara Rao జిల్లా I.T coordinator భూపాలపల్లి జయ శంకర్ జిల్లా