ఓం శ్రీ సాయిరాం. భగవాన్ శ్రీ సత్య సాయి బాబా ఆశీస్సులతో ఈరోజు పెంబి మండలం లోని అడవి మధ్యలో ఉన్న గిరిజన గ్రామమైన కోరుకంటి గోండు గూడెం లో రైతు సదస్సు నిర్వహించి రైతులకు పత్తి పంట పెరుగుదలకు కావలసిన జాగ్రత్తలు మరియు సందేహాలు తెలుసుకొని వాటి నివారణ ఉపయోగాలు తెలియజేయడం జరిగింది. ఈ సందర్భంగా గతంలో ఇచ్చిన మాట ప్రకారం సత్య సాయి సేవా సంస్థలు నిర్మల్ జిల్లా తరఫున రైతులకు ఉచితంగా HUMIC ACID AND AMINO ACID LIQUID పంట పెరుగుదలకు కావలసిన ఈ రెండు రసాయన లు సుమారు 100 ఎకరాలు సరిపడా పంపిణీ చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో సత్యసాయి సేవా సంస్థలు నిర్మల్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా రైతులకు ప్రతి నెలకు ఒకసారి వచ్చి ఉచిత సలహాలు మరియు కావలసిన ఇతర విషయాల్లో సాయం చేయడానికి ప్రయత్నిస్తామని చెప్పడం జరిగింది. సాయిరాం