ఓం శ్రీ సాయిరాం భగవాన్ శ్రీ సత్యసాయి బాబా వారి దివ్య అనుగ్రహ ఆశీస్సుల తో, సిద్దిపేట జిల్లా మహిళా విభాగం వారు జూన్ 8 వ తేదీ నుండి జూలై 5 గురు పూర్ణిమ వరకు 28 రోజుల పాటు రుద్ర పారాయణ చేశాం, " అష్టోత్తర శత సహస్ర రుద్ర పారాయణ" (1,108) సార్లు చేయాలని సంకల్పంతో ప్రారంభం చేసి, స్వామి వారి అపార కృపతో 2,039 సార్లు రుద్ర పారాయణ చేసి ఈ రోజు ముగించడం అయినది. ఇందులో మొత్తం 36 మంది మహిళలు పాల్గొన్నారు. ఇదే సమయం లో సిద్దిపేట సమితి మరియు ప్రశాంత్ నగర్ (SSSGSMY) మహిళలు 51 మంది మృత్యుంజయ మహా మంత్రం 3,44,388 సార్లు పఠించ డం జరిగింది. ఈ సందర్భంగా సిద్దిపేట వాళ్ళు అనారోగ్యం తో ఆర్థికంగా ఇబ్బందుల్లో ఉన్న ఒక కుటుంబం లోని ముగ్గురికి నూతన వస్త్రాలు, కిరాణా సామగ్రి అంద జేశారు జై సాయిరాం🙏🏼