🕉️ ఓం శ్రీ సాయిరాం 🕉️ భగవాన్ శ్రీ సత్యసాయి బాబా వారి దివ్యానుగ్రహంతో శ్రీ సత్యసాయి సేవాసంస్థలు జిల్లా సిద్దిపేట వారు స్వామివారి ఆరాధనోత్సవం రోజున ప్రారంభించిన 📿 కోటి సాయి గాయత్రి మంత్ర జప యజ్ఞం📿 41 రోజులుగా సాగి నిన్నటి వరకు అనగా 03-06-2020 రోజున ముగించాము. కరోనా మహమ్మారి నుండి ప్రపంచాన్ని కాపాడండి స్వామి అని ప్రార్థిస్తూ చేసిన ఈ జప యజ్ఞంలో జిల్లాలోని నాలుగు సమితులు, భజనమండలలు,sssvip గ్రామాలు,sss GSMY గ్రామాలు నుండి భక్తులు ,బాలవికాస్ విద్యార్థులు అంతా కలిసి సామూహికంగా 1,38,87,066 సాయి గాయత్రి మంత్రాన్ని స్వామి వారి పాదాలకు సమర్పించడమైనది. మరియు ఈరోజు సిద్దిపేట జిల్లాలోని నాలుగు సమితులు సాయి గాయత్రి హోమం నిర్వహించి పూర్ణాహుతి చేయడమైనది. ఈ గొప్ప అవకాశాన్ని అందించిన ప్రభువు చరణ సన్నిధికి శతకోటి నమస్సులతో. " సమస్త లోకః సుఖినో భవంతు" SSSSO జిల్లా సిద్ధిపేట