🌹 ఓం శ్రీ సాయిరాం 🌹 భగవాన్ శ్రీ సత్యసాయిబాబా వారి దివ్య అనుగ్రహ ఆశీస్సులతో తేదీ:15 ఫిబ్రవరి 2020 శనివారం రోజున "శ్రీ సత్యసాయి ప్రేమామృత సేవా సదనము" తంగళ్లపల్లి నూతన మందిర ప్రారంభోత్సవ వేదికలు అత్యంత వైభవంగా నిర్వహించబడినవి. కార్యక్రమ వివరాలు: 👉 ఉ.5.00 నుండి 6.30 గ. ల వరకు ఓంకారం, సుప్రభాతం, నగర సంకీర్తన, అష్టోత్తరం, శ్రీ రుద్ర పారాయనం నిర్వహించ బడినవి. 👉 ఉ. 8.00 గ. ల నుండి 8.30 గ.ల వరకు అల్పాహారం. 👉 ఉ.8.30 గ. ల నుండి 10.30గ.ల వరకు "గణపతి హోమం, భజన" నిర్వహించ బడినది. 👉 ఉ.10.35 గ. లకు జ్యోతి ప్రజ్వలన ఆహుతులచే నిర్వహించ బడినది. 👉 ఉ.10.44ని.లకు సమితి నూతన భవన ప్రారంభోత్సవం గౌరవనీయులు శ్రీ. పి. వెంకట్రావు గారు, తెలంగాణ శ్రీ సత్యసాయి సేవా సంస్థల రాష్ట్ర అధ్యక్షులు గారిచే నిర్వహించబడినది . కిచెన్ షెడ్ శ్రీమతి. కె. సుదాపూర్ణచందర్ గారు, తెలంగాణ రాష్ట్ర శ్రీ సత్యసాయి మహిళ కో ఆర్డినటర్ గారిచే నిర్వహించబడినది. మందిర కార్యాలయం శ్రీమతి. నివేదిత , తెలంగాణ శ్రీ సత్యసాయి యువ సమన్వయ కర్త గారిచే నిర్వహించబడినది. ప్రధాన మందిరం శ్రీ వాసిలి చంద్ర శేఖర్ (మందిర నిర్మాణ దాత), కన్వీనర్ ప్రశాంత్ నగర్ సమితి హైద్రాబాద్ గారిచే నిర్వహించబడినది. తదుపరి సభాకార్యక్రమము సోదరుడు శ్రీ మహేష్ గారి సమన్వయములో నిర్వహించబడింది. ఇందులో శ్రీమతి సుదాపూర్ణచందర్ గారు మాట్లాడుతూ 33 సంవత్సరాల సుదీర్ఘ ప్రస్థానం లో సమితిగా మారిన తరుణం లో అందరూ ఐకమత్యంగా సేవ లు, భజనలు, విద్య సంబంధ కార్యక్రమాలు చక్కగా నిర్వహించాలని తెలిపారు. శ్రీ అశోక్ రెడ్డిగారు , తెలంగాణ రాష్ట్ర శ్రీ సత్యసాయి ప్రశాంతి సేవల సమన్వయకర్త మాట్లాడుతూ మూడు పూజలు, ఆరు సేవలతో వర్ధిల్లాలని ఆకాంక్షించారు. శ్రీమతి నివేదిత గారు మాట్లాడుతూ యువత పర్తీ యాత్రలో అధిక సంఖ్యలో పాల్గొనాలని అన్నారు. తదుపరి రాష్టఆ అధ్యక్షులు శ్రీ వెంకట్రావు గారు మాట్లాడుతూ 33 సంవత్సరాలుగా భజన, బాలవికాస్ కార్యక్రమాలు చక్కగా నిర్వహించడం వల్ల పటిష్టమైన సంస్థ గా ఎదిగి నేడు శ్రీ సత్యసాయి సమితిగా ఆవిర్భవించిందని, నేడు సమితిగా ప్రకటిస్తున్నట్లు తెలిపారు. ఇక నుండి సమితి స్థాయి లో మూడు విభాగాలు చక్కగా నిర్వహించ వలెనని తెలిపారు. సమితి కన్వీనర్ గా అంకం వేణు గారు కొనసాగుతారని నూతన కార్యవర్గాన్ని త్వరలోనే నిర్మించుకొని అన్ని కార్యక్రమాల్లో ముందుకు రావాలని కోరారు. తదుపరి సంస్ధ, మందిర నిర్మాణం లో పాలు పంచుకున్న వారిని వస్త్రములు, జ్ఞాపికలు అందించారు. ముందుగా ఎంపిక చేసిన మహిళలకు 25 కుట్టు మిషిన్ల పంపిణీ నిర్వహించారు. దీనికి శ్రీ వాసిలి చంద్రశేఖర్ గారు ఆర్థిక సహకారం అందించారు. 👉 మ. 12.45 ని.లకు మహా మంగళ హారతి ఆహూతులచే నిర్వహించి తదుపరి స్వామి వారి భోజన ప్రసాదం అందరికీ అందించడం జరిగినది. ఇట్టి కార్యక్రమం విజయవంతం కావడానికి ప్రత్యక్షంగా పరోక్షంగా సహకరించిన ప్రతి ఒక్కరికీ స్వామి వారి ఆశీస్సులు ఉండాలని కోరుకుంటూ... ఇట్టి కార్యక్రమంలో karimnagar జిల్లా అధ్యక్షులు శ్రీ లింగ మూర్తి గారు, రాజన్న సిరిసిల్ల జిల్లా అధ్యక్షులు శ్రీ రవీందర్ గారు మరియు తోటి జిల్లా మహిళా, సేవదల్, యువ సమన్వయ కర్తలు, BHEL సమితి సభ్యులు (15), సిరిసిల్ల సమితి కన్వీనర్ శ్రీ రాము గారు,కో కన్వీనర్ శ్రీ సంతోష్ గారు, బొప్పపూర్, వేములవాడ, సిరిసిల్ల సమితి (50), తంగళ్లపల్లి సమితి సభ్యులు (70), తంగళ్లపల్లి మండల MPP, జడ్పీటీసీ, సర్పంచ్, భక్తులు, గ్రామస్తులు (300) పాల్గోన్నారు. సదా సాయి సేవలో...