ఓం శ్రీ సాయిరాం🙏భగవాన్ శ్రీ సత్యసాయి బాబా వారి 94వ జయంతోత్సవ వేడుకల్లో భాగంగా నిన్న17/11/2019 ఆదివారం సాయంత్రం ఖమ్మం శ్రీనివాసనగర్ లోని సత్యసాయిమందిరంలో బాలవికాస్ విద్యార్థులతో "ప్రేమ తరంగాలు" కార్యక్రమం నిర్వహించబడింది.. బాలవికాస్ గురువులు విద్యార్థులతో ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్బంగా స్టేట్ ఆధ్యాత్మిక కోఆర్డినేటర్ శ్రీ బులుసు సాంబమూర్తి గారు బాలవికాస్ ప్రాధాన్యత గురించి వివరిస్తూ తమ పిల్లల మంచి భవిష్యత్తు కొరకు బాలవికాస్ తరగతులకు పంపవలసినదిగా తల్లి తండ్రులను కోరారు. సాయి సభ్యులందరు మందిరానికి రావలసిందిగా సూచిస్తూ ప్రతిన బూనవలసినదిగా కోరారు.. చిన్నారి బాలవికాస్ విద్యార్థులు ప్రదర్శించిన కార్యక్రమాలు అందరినీ ఆకట్టుకున్నాయి.