4:00 గం. ల నుండి స్వామి వారి పల్లకీ సేవా కార్యక్రమము కార్తికేయనగర్, నాచారంలో జరిగింది. ముందుగా మహిళా విభాగంచే, స్వామి వారి పల్లకీ సుందర మనోహరంగా, కన్నుల పండుగ గా అలంకరించబడినది. ఈ పల్లకీ సేవలో 75 మంది భక్తులు ఎంతో ఉత్సాహంగా పాల్గొన్నారు. స్వామి వారి అవతార ప్రకటన వివరాలు, స్వామి వారి యొక్క 20ని.ల వీడియో కార్యక్రమము ద్వారా ప్రదర్శించబడినవి. స్వామి వారికి మంగళహారతితో ఈ కార్యక్రమము సుసంపన్నం అయినది.