కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ సత్యసాయిఈశుని 94 వ జయంతి ఉత్సవాలు శ్రీ సత్య సాయి సేవా సమితి ఆల్వాల్ లో ఘనంగా జరుగుతున్నాయి. ఉత్సవాల్లో భాగముగా స్వామి వారి అవతార ప్రకటన రోజున ఆదివారము (20-10-2019) సాయంత్రం స్వామివారి స్వర్ణ వర్ణం రథోత్సవం, మానవతా విలువలతో కూడిన నడక (Walk for Values) వైభవంగా నిర్వహించారు. పుష్పాలతో అలంకరించిన స్వర్ణ వర్ణ రథంపై భగవాన్ శ్రీ శ్రీ శ్రీ సత్య సాయి నాధుడు ఆసీనులై.. ఆల్వాల్ తిరు వీధుల్లో ఊరేగుతూ భక్తులకు అభయమిచ్చారు. స్వర్ణ వర్ణ రథంపై ఊరేగిన స్వామివారిని దర్శించుకోవడానికి భక్తులు భారీగా తరలివచ్చారు. స్వర్ణ వర్ణ రథోత్సవంలో భజనలు, బాలవికాస బాల బాలికలు నృత్యాలు, కోలాటాలతో మరియు మానవతా విలువలతో కూడిన సందేశాలు ప్రదర్శిస్తూ ఆల్వాల్ పుర వీధుల్లో సందడి కనిపించింది.భగవాన్ బాబా వారి దివ్యమైన కరుణ కటాక్ష వీక్షణములు ఆల్వాల్ సమితి పై ప్రసరింప భక్తులు మైమరచి స్వామి వారి అనుగ్రహం పరిపూర్ణముగా పొందారని మనసా వాచా నమ్ముతున్నాను. ఈ వేడుకలో ఆల్వాల్ సర్కిల్ ఇంస్పెక్టర్ శ్రీ యాదగిరి గారు, జిల్లా అధ్యక్షులు శ్రీ సోమసుందరం గారు, అడ్వకేట్ అసోసియేషన్ అధ్యక్షలు శ్రీ దేవేందర్ బాబు గారు భక్తి శ్రద్దలతో పాల్గొన్నారు. భగవాన్ శ్రీ శ్రీ శ్రీ అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు సత్య సాయి నాధునికి సతసహస్రకోటి ప్రణామాలు అర్పిస్తూ - మీ జె ఈశ్వర్ రావు కన్వీనర్ ఆల్వాల్ సమితి