ఓం శ్రీ సాయిరాం భగవాన్ బాబా వారి ఆశీస్సులతో ఈ రోజు తేది 06/09/2019 నాటికి "శ్రీ సత్యసాయి నిత్యాన్నసేవ పథకం" మొదటి వార్షికోత్సవం సంద్భంగా ప్రభుత్వ ఆసుపత్రిలో అత్యంత వైభవంగా నిర్వహించడం జరిగింది.ఇందులో ముఖ్య అతిథులచే మొక్కలు నాటించడం జరిగింది. ఇందులో సుమారుగా 600 మందికి అన్నదానం చేయడం జరిగింది.ఇట్టి కార్యక్రమంలో రాష్ట్ర మహిళ ఇంచార్జి smt.సుధా పూర్ణచందర్ గారు, రాష్ట్ర నిత్యాన్న సేవా ఇంచార్జి శ్రీ అశోక్ రెడ్డి గారు, జిల్లా కార్యనిర్వాహక అధ్యక్షులు శ్రీ బూర రవీందర్, జిల్లా సేవాదల్ ఇన్ఛార్జ్ శ్రీ ఉమాశంకర్,సత్యనారాయణ, యూత్ ఇంచార్జి సత్యసాయిరాం, సిరిసిల్ల సమితి కన్వీనర్ శ్రీ అన్నల్దాస్ రాము గారు, శ్రీ సత్యసాయి సర్వీస్ సెంటర్ చైర్మన్ శ్రీ చీకోటి అనిల్ గారు, బొప్పపూర్ సమితి కన్వీనర్ శ్రీ బాబు గారు, తంగళ్లపల్లి సమితి కన్వీనర్ శ్రీ అంకం వేణు గారు,ఆత్మీయదాత డా.కోడం విక్రమ్ గారు,మహిళ మరియు జెంట్స్ సేవాదల్ సభ్యులు, యూత్ సభ్యులు, 365 రోజులు నిర్విఘ్నముగా కొనసాగించుటకు సహకరించిన దాతలు, హాస్పిటల్ సిబ్బంది మరియు టైలరింగ్, మగ్గం వర్క్స్ ట్రైనీస్ పాల్గొన్నారు.