మనం చూస్తున్నాం ఎంత మంది యువత తమ యువ శక్తిని దూర్వ్యసనాలకి బలి చేసుకుంటూ తల్లి దండ్రులకి గర్భ శోకం మిగులుస్తున్నారో! నేడు ఆధునిక టెక్నాలజీ మోజులో పడి తమ జీవితాలను వ్యర్థం చేసుకొంటూ, వారి జీవిత లక్ష్యాలను మరిచి , జీవిత కాలాన్ని వృధాగా మార్చేసుకుంటూ కుటుంబానికి, సమాజానికి భారంగా మారివూతున్నారు. దీనిని సరి చేయటానికి భగవాన్ బాబా వారు మనకిచ్చిన అద్భుత అవకాశం బాలవికాస్!!! దానిని అందరికీ అందించడం కోసం , దాని ప్రాధాన్యాన్ని వివరించి భారతీయ సంస్కృతీ, సంప్రదాయాలను తెలియపరుస్తు, సరైన దిశా నిర్దేశం చేయుటకై స్వామి వారి దయతో తేదీ 15, 16 &17 ఏప్రిల్ లలో మన శ్రీ సత్యసాయి సేవా మందిరం సిరిసిల్లలో 6-10 తరగతులకు చెందిన విద్యార్థులకు రోజూ 9am to 5pm వరకు "భారతీయ సంస్కృతీ, సమగ్ర వికాస శిబిరం" నిర్వహించడం జరిగింది. ఇట్టి కార్యక్రమంలో 64 బాలికలు మరియు 51 బాలురు రిజిస్ట్రేషన్ చేసుకొని మూడు రోజులు హాజరయ్యారు. మధ్యాహ్న భోజనం కూడా ఇక్కడే పూర్వ బాలవికాస విద్యార్థులచే ఏర్పాటు చేయడం జరిగింది. కార్యక్రమ వివరాలు: మొదటి రోజు స్వాగతోపన్యాసం & ఉద్దేశ్యం - బాలరాజు (బాలవికాస్ కో ఆర్డినేటర్ [రాజన్న సిరిసిల్ల]) విద్య అంతిమ లక్ష్యం శీల నిర్మాణం - సంపత్ (సత్యసాయి స్కూల్ ప్రిన్సిపాల్ [బెజ్జంకి]) 3H , ఓంకారం & సైలెంట్ సిట్టింగ్ - సత్య సాయిరాం సంగీతం (యూత్ కో ఆర్డినేటర్ [సిరిసిల్ల]) సింపుల్ లివింగ్ & హై థింకింగ్ - యమునా రాణి (సర్వీస్ కో ఆర్డినేటర్ [సిద్దిపేట]) భారతీయ సంస్కృతి - రత్నాకర్ (టీచర్) ప్రార్థన శ్లోకాలు - జ్యోతి (బాలవికాస్ కో ఆర్డినేటర్ [పెద్దపల్లి]) రెండవ రోజు మానవతా విలువలు & పంచ భూతాల విశిష్టత - రాధాకృష్ణ (స్పిరిట్యుయల్ కో ఆర్డినేటర్ [మంచిర్యాల]) రామాయణం లోని ఆదర్శ పాత్రలు - సాంబమూర్తి (రాష్ట్ర స్పిరిట్యుయల్ కో ఆర్డినేటర్) కాలిగ్రఫీ - రేణుక (మహిళా యూత్ ఇంచార్జి [కరీంనగర్]) మాతృ దేవో భవ, పితృ దేవో భవ - గణేష్ (బాలవికాస్ ఇంచార్జి [కరీంనగర్]) యోగా & సూర్య నమస్కారాలు - శ్రీనివాస్ (టీచర్) మూడవ రోజు భాగవతం చదివితే బాగవుతాం - మురళి (స్పిరిట్యుయల్ కో ఆర్డినేటర్ [రాజన్న సిరిసిల్ల]) గాత్రం, సంగీతం&వాయిద్యం, గాయత్రి మంత్రం విశిష్టత - రవీందర్ (జిల్లా అధ్యక్షులు [సిరిసిల్ల]) ఆరోగ్యం, పరిశుభ్రతా & కుటుంబ బాధ్యత - నరేష్ (రీజినల్ యూత్ కో ఆర్డినేటర్[కరీంనగర్]) ఈ కార్యక్రమ ఫుడ్ ప్రేపరేషన్ సేవలో భాగస్వామిలైన మహిళా సేవాదళ్ సభ్యులు మరియు జెంట్స్ సేవాదళ్ సభ్యులు మరియు సౌండ్ సిస్టం కెమెరా టెక్నీషియన్ బాలు,గణేష్ మరియు ఇతర సభ్యులను కన్వీనర్ రాముగారు అభినందించారు. స్వామి వారి కృపతో విజయవంతంగా కార్యాక్రమం ముగించడం జరిగింది.